నీవు క్షత్రియ వంశజుడవు. సకల ధర్మజ్ఞుడవు. అనాథులను రక్షించడం నీ కర్తవ్యం. నీలాంటి వాడు రక్షకుడయి కూడా రక్షణ లేక బ్రతుకుతున్నాము మేము. త్వంహి పశ్య శరీరాణి- మునీనాం భావితాత్మనాం- హతానాం రాక్షసైట్హోరైః కావలిస్తే నీవే వచ్చి చూడు ఎంత మంది మహర్షుల నా దుర్మార్గులు వధించారో. వారి కళేబరాలెన్నెన్ని గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయో.. నీవు వారి ఉపద్రవం నుంచి మమ్ములను కాపాడలేకపోతే మాకు వేరే శరణ్యం లేదని వాపోతారు. అలా వాపోతే ఇక మీదట ఇలాంటి దారుణమేదీ జరగకుండా చూచే పూచీ నాదని వారి కభయమిస్తాడు రాముడు.
ఆ తరువాత సీత ఒకనాడు రాముణ్ణి చూచి ఇలా అంటుంది. ప్రతిజ్ఞాత స్వయావీర - దండకారణ్యవాసినా- మృషీణాం రక్షణార్ధాయ- వధస్సంయతి రక్షసామ్-మీరు ఆ తాపసులకోసం రాక్షసులందరినీ సంహరిస్తానని శపథం చేశారే. అది నా కేమాత్రమూ సరిపోలేదు. మీరిక్కడికి వచ్చింది తాపస ధర్మాన్ని సేవించటానికి గాని క్రూరమైన క్షాత్ర ధర్మాన్ని సేవించటానికి గాదు. రాక్షసులతో మనకేమి వైరం. వైరం లేకుండానే వారిని వధించటానికి పూనుకోటం నా కిష్టంలేదు. క్వచ శస్త్రం - క్వచ వనం - క్వచ క్షాత్రం తపః క్వచ - క్షత్రియులు చేయవలసింది ఆర్తత్రాణ మనేది మనమిప్పుడు క్షత్త్రియ వృత్తిలో లేము. తాపసవృత్తిలో ఉన్నాము. అంచేత క్షాత్ర ధర్మాన్ని పాటించటం పనికిరాదని హెచ్చరిస్తుంది. దీనికి రాముడిచ్చిన సమాధానం చూడండి ఎలా ఉందో. త్వయైవోక్త మిదంవచః-క్షత్రియై ర్థార్యతే చాపో -నార్తశబ్దా భవేదితి దేవీ! నీవే గదా అన్నావిప్పుడు క్షత్రియుడే ధరించాలి చాపాన్ని ఆర్తనాదం వినపడరాదని. అందుకు పోయినా నేనుగా తాపసులను రమ్మని ఆహ్వానించలేదుగదా వారంతటవారే వచ్చి నాతో మొఱపెట్టుకొన్నారు. రక్షణ ఇవ్వమని ప్రాధేయపడ్డారు. పైగా ఆ రాక్షసులను మేము శాపమిచ్చి భస్మం చేయడానికి కూడా తపోవ్యయం చేయట మిష్టంలేక వారాఖరుకు మమ్మల్ను చంపి తింటున్నా సహించి చూస్తున్నాము.
Page 50