ఇంత ప్రగాఢమైనది రాముడి పితృభక్తి. పుత్ర అనే పేరు సార్థకం చేసుకున్న వ్యక్తి ఆయన. పున్నామ నరకం నుంచి కాపాడేవాడనే గాక పూరణాత్పుత్ర- తండ్రి చేయలేక వదిలివేసిన కోరికలను సఫలం చేయటం వల్ల కూడా పుత్రుడు పుత్రుడవుతాడట. ప్రస్తుతం దశరథుడు చేయలేనిది తాను మామగారి కిచ్చిన మాట నిలబెట్టుకోలేక పోవటం. అది నిలబెట్ట గలిగాడు రాముడు. కనుకనే సుపుత్రుడాయన. పుత్ర ధర్మాన్ని ఎంతగానో అంతగా అనుష్ఠించాడు. తన తండ్రి విషయంలోనే గాదు. తండ్రి కత్యంత ప్రియ మిత్రుడూ తండ్రితో సమానుడైన జటాయు విషయంలో కూడా అలాంటి ధర్మాన్నే కనబరిచాడు. సీతను కాపాడటానికి రావణుడితో పోరి ప్రాణాలు కోల్పోయిన ఆ దిక్కులేని పక్షిని చూచి రాజా దశరథః శ్రీమాన్ -యథామమ మహాయశాః పూజనీయశ్చ మాన్యశ్చ - తదాయం పతగేశ్వరః గృధ్రరాజమ్ దిధక్షామి - మత్కృతే నిధనంగతమ్ - మన తండ్రి దశరథుడెలా మనకు పూజనీయుడో - అలాగే ఈ గృధ్రరాజు కూడా, నా కోసంగా ప్రాణాలు వదిలిన మహానుభావుడు. ఇతనికి దహస సంస్కారం చేయటం' నా విధి అంటాడు లక్ష్మణుడితో. తిర్యక్కులకు కూడా ప్రేత కార్యాలు నిర్వర్తిస్తా నంటాడు చూడండి. అంతకంటే పుత్ర ధర్మాన్ని పాటించే దీక్షాపరుణ్ణి మరొకణ్ణి చూడగలమా మనం.
పుత్ర ధర్మం తరువాత రాముడిలో చెప్పుకోవలసింది క్షత్ర ధర్మం. అది మన కరణ్యకాండలో కనిపిస్తుంది. క్షతాత్కిల త్రాయత ఇతిక్షత్రః క్షతము నుండి కాపాడే వాడెవడో వాడు క్షత్రియుడు. క్షతమంటే దెబ్బ. పరుల వలన కలిడే ఉపద్రవం. ఎవరా పరులు. ఖరదూషణాది రాక్షసులు. అరణ్యంలో ఉండే దంతావారే. నిష్కారణ వైరులువారు. వారి వల్ల నిత్యమూ ఉపద్రవమే అక్కడ నివసించే తాపసులకు. వారినా రాక్షసులు వచ్చి క్షతగాత్రులనే గాదు. హతగాత్రులనే చేస్తున్నారు. రాముడా పరిసరాలలో ప్రవేశాంచాడని తెలియగానే వచ్చి వారంతా మొరపెట్టు కుంటారు.
Page 49