మనుష్యలోకంలోనే నివసిస్తానని హామీ ఇస్తాడు. మధ్యలోకూడా అత్మానమ్ మానుషమ్మన్యే - నన్ను నేను మనుష్యుడననే భావిస్తున్నానంటాడు. దీనిని బట్టి మనుష్యుడుగా జన్మించి మనుష్యుడుగా భావిస్తూ రావణాదులకు కూడా మనుష్యుడనే భ్రమ కలిగించటానికి మానవోచితంగానే ప్రవర్తించటం వల్ల రాముడు భగవంతుడనే భావం ఎవరికీ కలగటంలేదు.
దీనికి తోడు రెండూ విభవావతారాలే అయినా కృష్ణావతారంలోలాగా వేషభాషలు గాని లీలలు గానీ- ఏవి చూచినా రాముడు మానవుడనే తోస్తుంది గాని భగవదవతారమనే భావ మెక్కడా కనపడదు మనకు. కృష్ణుణ్ణి -లీలామానుషుడనీ -రాముణ్ణి మాయామానుషుడనీ లోకులు వ్యవహరిస్తుంటారు. మాయామానుషుడని రాముణ్ణి వర్ణించటం మాయకతీతుడనే దృష్టితోగాదు. దానిక ధీనుడయి ప్రవర్తించాడనే అభిప్రాయంతో అనేమాట. రాముడి జీవితం కొనామొదలు ఎక్కడ ఏ ఘట్టం చూచినా మానవోచితంగానే సాగందిగాని తదతీతంగా సాగినట్టెక్కడా కనిపించదు. అలా సాగింది కృష్ణావతారంలోనే. మాయకధీనుడు కాడాయన. అతీతుడు. కనుకనే ఈయన మాయామానుషుడైతే ఆయన లీలా మానుషుడని ప్రఖ్యాతి గాంచారు. మానవ శరీరంతో అవతరించా డనిమాటే. ఆయన జీవితంలో ప్రదర్శించింది ప్రతి ఒకటీ ఒక లీలే. అసలు జీవితమంతా లీలామయమే. భగవదవతారమనే సత్య మడుగడుగునా మనకు కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. గరుత్మంతుడు పిలిస్తే పలుకుతాడు కృష్ణుడికి. ఎక్కడికి వెళ్ళాలన్నా గరుత్మంతుడిపైనే. రాముడి జీవితంలో ఎక్కడా కనిపించడు గరుత్మంతుడు. ఎప్పుడో యుద్ధ సమయంలో నాగపాశబద్ధుడయి నప్పుడాపద్ధర్మంగా మాత్రమే దర్శనమిస్తాడు. అదీ అవసరం తీరగానే మాయమయి పోతాడు.
సముద్రం రాముడికి దారే ఇవ్వలేదు. కోపం వచ్చి మీద బాణ ప్రయోగం చేయబోతేగాని దర్శనమీయడు. అప్పటికీ సేతువు నిర్మించి
Page 5