#


Index

  మరి పరుశురాముడి మాటలలో - మందోదరి విలాపంలో యుద్ధానంతరం బ్రహ్మాది దేవతలు సాక్షాత్కరించి ఆయనను సంబోధించిన తీరులో కథలో ఎక్కడ చూచినా రాముడు విష్ణు అవతారమనే సత్యం అతి స్పష్టంగానే మనకు గోచరమవుతున్నది. ఇంత సాక్ష్యాధారాలున్నా సరే కృష్ణుడి విషయంలో కలిగిన నమ్మకం మనకు రాముడి విషయంలో కలగటం లేదు. ఏమి కారణం.

  దీనికి కారణమొకటి గాదు. చాలా ఉన్నాయి. అందులో మొదటిది రామావతారానికి ముందు జరిగిన వృత్తాంతం. రావణుడు తన కెవరివల్లా చావులేకుండా అనుగ్రహించమని బ్రహ్మదేవుణ్ణి వరం కోరుతాడు. సర్వామరత్వ మనేది అసంభవం. మరొక వరం కోరమంటాడు బ్రహ్మ. అలాగైతే వీరి వల్ల నా కవధ్యత్వం ప్రసాదించమని కోరుతూ నహిచింతా మమాన్యేషు - తృణ భూతాహితేమన్యే ప్రాణినోమానుషాదయః- అని మిగతా మనుష్యాది ప్రాణులను తృణీకరించి మాటాడుతాడు. భవిష్యత్యేవమేతతే-అలాగే జరుగుతుంది పొమ్మని పితామహుడు దీవించి వెళ్లుతాడు. దీనిని బట్టి తేలిందేమిటి. వాణ్ణి వధించాలంటే మానవుడుగానే అవతరించాలి పరమాత్మ. దీని కనుగుణంగా దశరథుడు పుత్రకామేష్టి చేసే సందర్భంలో హవిర్భాగాలు గ్రహించటానికి వచ్చిన దేవతలు రావణుడి బాధలు బ్రహ్మతో మొరపెడితే ఆయన వారితో నా తర్క యదవజ్ఞానా - త్తద్రక్షో మానుషాంస్తదా తస్మాత్సమానుషాద్వధ్యః మృత్యురాన్యోస్యవిద్యతే- అంటాడు. అతడు మనుష్యుని వల్లనే చావాలిగాని మరొకరివల్ల చచ్చేవాడుకాదు. కనుకనే అక్కడికి వచ్చిన విష్ణువును వారు ప్రార్థించినపుడుకూడా వధాయదేవ శత్రూణాం - నృణాంలోకేమనః కురు రాక్షసులను - వధించటానికి స్వామీ నీవు మనుష్యలోకంలో మనసు పెట్టమంటారు. ఆయనకూడా దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ వత్సా ్యమి మానుషేలోకే - పాలయన్ పృథివీమిమామ్ పదకొండు వేల సం. భూమిని పాలిస్తూ

Page 4