పోతే రాముడు అథాభివాద్య రాజానమ్ రధ మారుహ్య రాఘవః యయౌస్వం ద్యుతిమ ద్వేశ్మ- జనౌఘై : పరిపూజితః జనమాంతా చుట్టూ పొగడుతూ వస్తుంటే తండ్రి కభివాదం చేసి రథ మధిరోహించి మౌనంగా మరలా తన మందిరానికి వెళ్ళుతాడు.
తండ్రి ఒకప్పుడు తనకిష్టంగాని మాట చెప్పినా అది అసంగత మనుచితమని తన కనిపించినా గుణవంతుడైన పుత్రుడు ప్రత్యక్షంగా ఎదిరించి మాటాడరాదు. ఇది కూడా రాముడి విషయంలో సాక్షాత్కరిస్తుంది మనకు. మరలా రెండవ మారు పిలిపించి ఏకాంతంగా రాముడితో ప్రసంగిస్తాడు దశరథుడు. తాను ముసలివాడ నయ్యానని రాజ్యభారం మోయలేనని తన గోడంతా చెప్పుకొని వెంటనే రెండవరోజే నీకు పట్టాభిషేకం చేయాలని ఉంది. అదీ భరతుడు వచ్చే లోపలే అయిపోవాలి. వాడు నీకెంత అనురక్తుడైనా చెప్పలేము. మానవుల బుద్ధులు నమ్మరాదుగదా అని లేనిపోని అభాండలాన్నీ వేస్తాడు. తనలో దాగి ఉన్న భయాన్ని మరొక భంగిమలో బయటపెడతాడు. ఇదంతా వాస్తవంలో రాముడి కిష్టంలేదు. అయినా పితృ గౌరవంతో సహించాడు. పల్లెత్తు మాట బదులాడకుండా వెళ్ళిపోయాడు. మాటలాడటం చేతగానివాడా అంటే అలాకాదు మరలా. ఆ ఆవేదన అంతా తల్లి దగ్గర వెళ్ళగక్కుతాడు. అదీ ఎంతో నాజూకుగా. అంబపిత్రా నియుక్తోస్మి-ప్రజాపాలన కర్మణి-భవితా శ్వోభిషేకోయం- యథామే-శాసనం పితుః అమ్మా తండ్రి గారంటున్నారు. నాకు రాజ్యపాలన ఒప్పజెబుతారట. రేపేనట అభిషేకం. ఇలాగని ఆదేశిస్తున్నాడు. మరి విన్నావా అంటాడు. రేపేనంటే ఆవిడకు తెలియదా భరతు డయోధ్యలో లేడని. రెండవరోజుకే రాలేడని. భరతుడు కూడా లేకుండా ఇంత హడావుడిగా తండ్రి ఈ పట్టాభిషేకం నాకు తలపెట్టట మేమిటి. ఇది జరిగేదేనా. ఆయన చేయాలేడు. నేను చేసుకొనేది లేదు. అని ఎంత కాకువుగా ఆక్షేపించటమో చూడండి ఇది. అయినా తండ్రినా తల్లి ఎదుట ఆక్షేపిస్తున్నా ఎంత నిగ్రహమో చూడండి మరలా.
Page 46