ధర్మ పాలనము
రామోవిగ్రహవాన్ ధర్మః - మూర్తీభవించిన ధర్మమే నంటాడు. రాముణ్ణి. ధర్మభృతామ్ వరః- అని వాల్మీకి మాట. ధర్మమంటే ధనుస్సని కూడా అర్థమే. ధనుస్సు నెలా ధరించాడో రాముడు ధర్మాన్ని కూడా అలాగే ధరించాడు. తన ధనుస్సులాగే తన ధర్మంకూడా గురితప్పదు. నిర్లక్ష్యంగా వర్తించదు. లక్ష్యంమీదనే దృష్టి. తండ్రి దశరథుడు విడిచిన బాణమైనా గురితప్పి వధ్యుడు కానివాణ్ణి వధించిందేమో గాని తనయుడి బాణం మాత్రం చాటునుంచి ప్రయోగించినా వధ్యుడైన వాణ్ణి వధిస్తుంది. ఒకేబాణం ఒకేమాట - ఒకేపత్ని - అనేది రాముణ్ణి చూచి పుట్టినమాటే. ధర్మానికి మారుపేరే శ్రీరాముడు.
అసలు రామాయణారంభంలోనే వస్తుందొక చక్కని ప్రస్తావన. ఇంకా రామాయణేతిహాస రచన కుపక్రమించలేదు వాల్మీకి. సర్వలక్షణ లక్షితుడైన మహాపురుషు డెవడైనా నీ ఎఱుకలో ఉంటే చెప్పమని అడుగుతాడాయన నారద మహర్షిని. త్రిలోక సంచారి అయిన నారదుడు బేరీజువేసి అందరినీ త్రోసిపుచ్చి చివరకొక్క శ్రీరాముడికే పట్టాభిషేకం చేస్తాడు. సకల సద్గుణాలూ ఆయన ఒక్కడిలోనే రాశీభూతమయి ఉన్నాయి. కావలసి ఉంటే ఆయననే కథా నాయకుణ్ణి చేసుకోని కావ్యనిర్మాణం చేయమని చెప్పివెళ్లిపోతాడు. ఆ సందర్భంలో ఆయన ఉదాహరించిన నాయక లక్షణాలొకటిగాదు రెండు గాదు. చాలా ఉన్నాయి. ధర్మజ్ఞ - స్సత్యసంధశ్చ - ప్రజానాం చహితేరతః మొట్టమొదటనే ధర్మజ్ఞుడని పేర్కొంటాడు రాముణ్ణి. ధర్మాని కాయన జీవితంలో అంత ప్రాధాన్యముంది. ధర్మం తెలిసినవాడు ధర్మజ్ఞుడు, కనుకనే సత్యసంధుడు కూడా. నంధ అంటే ప్రతిజ్ఞ. చెప్పినమాట నెరవేర్చటమే సత్యసంధత్వం. ఇవి రెండూ ఉన్నవాడు తప్పకుండా ప్రజాహిత కార్య ధురంధరుడవుతాడు. ఉత్తమ మానవుడికే గాక దేశమేలే
Page 35