#


Index

లక్ష్మణుణ్ణి దేశంనుంచి బహిష్కరించటమూ కూడా యముడికి తాను చేసిన వాగ్దానాని కనుగుణంగా త్వరలోనే వైకుంఠాన్ని చేరటాని కేర్పరుచుకొన్న ప్రయాణ సన్నాహమే. మరేదీగాదు.

  ఈ విధంగా చూస్తూపోతే రామాయణ మాద్యంతాలలోనేగాక మధ్యవర్తి అయిన కథా భాగాల నెక్కడెక్కడ తడవిచూచినా కథా నాయకుడు మన మనుకొన్నట్టు ప్రాకృత మానవుడు కాడని సాక్షాత్తు పరమాత్మేనని చెప్పకుండానే తెలిసిపోతుంది. శబరీ శరభంగ సుతీక్షాదులను తరింపజేయటమేగాదు. జటాయువుకు పుణ్యలోకాలు ప్రసాదించటమేగాదు విరాధాదులకు శాపమోక్ష మను గ్రహించటమేకాదు - కాకాసురుణ్ణి ముప్పుతిప్పలు పెట్టి మూడు లోకాలు తిప్పటమే గాదు - మరి సప్తసాలై కకాల విభేదనాపాది బాణ ప్రయోగమేగాదు. ఇలాటి అతి మానుషచర్యలే కొన్ని చూచినా దాఖలా అవుతుంది రాముని దివ్యాసుభావం. అయితే ఒక్కమాట. పరమాత్మే అయి కూడా ఆయా సందర్భాలలో మనబోటి జీవులకంటే కూడా దీనంగా పామరంగా ఎందుకు ప్రవర్తించా డాయన. ఏమి అవసరమని ప్రశ్న. దాని కాయన ఇచ్చాడు సమాధానం. ఆత్మానమ్ మానుషమ్మన్యే - అని మానవుడుగా జన్మిస్తానని మొదట దేవతలకు హామీ ఇచ్చాడు. వత్స్యామి మానుషే లోకే అని. అలాగే మనుష్యలోకంలో జీవించాడు. చివరకు వివేశ వైష్ణవంతేజ స్సశరీర స్సహానుజః - ఈ మానవ శరీరాన్ని వైష్ణవమైన తన దివ్యతేజస్సులో ప్రవిలయం చేసుకొని దివ్యమైన శరీరంలో వెలుగొందాడు. అదైనా ఎందుకని అడిగితే - అలాగైతే గాని రావణుడు వధ్యుడు కాడని సమాధానం. సృష్టిలో ఏ ప్రాణివల్లా చావగూడదని పరమేష్ఠివల్ల వాడు పొందినవరం. అందులో మానవుడిదేమిలే అని వాడి సంగతి ఏ మాత్రమూ పట్టించుకోలేదా దానవుడు. మరి వాణ్ణి చంపాలంటే మానవుడుగా జన్మించాలి పరమాత్మ. మరో మార్గంలేదు. అలా జన్మిస్తేనే పితామహుడి వరాన్ని తాను మన్నించినట్టూ అవుతుంది.

Page 32