#


Index

చూడండి. ఎంత ధూర్తత్వమో ఇది. భగవంతుడని తనకు తెలియదట. మానవుడనే అని అనుకుంటున్నాడట. వారు చెబితే తెలసుకోవాలని ఉందట. ఒకరు చెప్పట మేమిటి. తానేగా మానవలోకంలో మానవుడుగా అవతరిస్తానని దేవతలతో చెప్పి వచ్చాడు. అప్పుడే మరిచిపోయాడా. మరిస్తే పరమాత్మ ఎలా అవుతాడు. సరిగా ఇక్కడ కృష్ణుడు మాటాడుతున్నట్టుంది గాని రాముడు మాటాడుతున్నట్టు లేదు. ఆ నటనే ఈ నటన అని చెప్పటానికింతకన్నా మంచిఘట్టం మరొకటి కానరాదు. అందుకేనేమో బ్రహ్మ వెంటనే అందుకొని భవాన్నారాయణోదేవః - అజితః ఖడ్గభృద్విష్ణుః కృష్ణశ్చైవ బృహద్భలః అని కృష్ణనామంతోకూడా సంబోధిస్తాడా ఆది దేవుణ్ణి. సహస్ర చరణః శ్రీమాన్ శతశీర్షస్సహస్రదృక్. - అని విరాడ్రూపాన్ని మరోమారు కీర్తిస్తాడు. మహేశ్వరుడు కూడా అలాగే స్తుతిస్తాడు. ఆఖరుకు తండ్రి దశరథుడుకూడా వారితో పాటు ఆయనకు దర్శనమిచ్చి నీ అరణ్యగమనాదికంలోని అంతరార్థమంతా ఇప్పటికి నాకు బోధపడిందని నివేదిస్తాడు. ఇంద్రుడు యుద్ధ భూమిలో చనిపోయిన వానరులనందరినీ ఆయన ప్రీత్యర్థం మరలా బ్రతికిస్తాడు. ఆయన ప్రీత్యర్థ మేమిటి. అది తన ప్రీత్యర్థమే. వారంతా ఎవరా వానరులు. తన పరివార దేవతలే గదా. తరువాత పుష్పకారూఢుడై బంధుమిత్ర పరివార సమేతంగా సాకేతపురానికి రావటం మహావైభవంగా పట్టాభిషేకం చేసుకోవటం దానికి ఋష్యాదులంతా విచ్చేయటం ఇదంతా ఒక విధంగా భగవద్విభూతి ప్రదర్శనమే. దాని కొక నిదర్శనమే.

  మరొక విశేషమేమంటే పట్టాభిషేకానంతరం అగస్త్యాదులందరూ వచ్చి తన్ను శ్లాఘిస్తుంటే ఏదో ప్రసంగవశాత్తూ అడిగినట్టు పైకి నటిస్తూ తన ప్రత్యర్థిఅయిన రావణాదుల పూర్వవృత్తాంతాన్ని అడిగి తెలుసుకోటం. ఉత్తరకాండలో సగభాగమదే. పూర్వం రామాయణమైతే ఉత్తరం రావణాయనం. ప్రత్యర్థిఅని పేరేగాని వాడూ తనవాడేగా. తన ద్వార

Page 30