యదైవ చ జనస్థానే - రాక్షసైర్చహు భిర్వృత:- ఖరస్తవహతో భ్రాతా తదైవాసౌ నమానుష : య దైవ వానరైర్హోరై ర్భద్దస్సేతు ర్మ. హార్ణవే తదై వహౄదయేనాహం - శంకేరామ మమానుషమ్. జనస్థానంలో ఖరదూషణుల నంతమంది సైన్యంతో సహా అంత మొందించాడంటేనే రాముడు మానవ మాత్రుడు కాడు. అపారమైన సాగరంమీద అంత.పెద్ద వంతెన నిర్మించి వచాడంటేనే మానవుడు కాడు. అయితే మరెవడు. వ్యక్త మేషమహాయోగీ – పరమాత్మా సనాతనః తమసః పరమోధాతా - శంఖచక్ర గదాధరః మానుషం వపురాస్థాయ - విష్ణుస్సత్యపరాక్రమః సర్వైః పరివృతోదేవైః వానరత్వముపాగతైః లోకానాం హితకామ్యయా - సరాక్షస పరీవారమ్ హతవాంస్త్వామ్ మహాద్యుతిః ఆ శంఖ చక్ర గదా ధరుడైన లక్ష్మి వరుడే వానరరూప ధరులైన దేవతల నందిరినీ వెంటబెట్టుకుని శ్రీరాముడనే పేరుతో మానవరూపాన్ని ధరించి వచ్చి అనన్య వధ్యుడవైన నిన్ను చివరకు వధించి వెళ్లాడని విలపిస్తుంది. చూడండి. విలాపంచేస్తూ అన్నా ఆవిడనోట వచ్చిన ఈ మాట లెంత సత్యాన్ని మనకు చాటి చెబుతున్నాయో. మహాపతివ్రత నోటవచ్చింది సత్యంగాక అసత్యమెలా అవుతుంది. ఎంత కాలంనుంచో తన హృదయంలో దాగి ఉన్న పరమ సత్యాన్నే వెళ్లగ్రక్కిందా మహాతల్లి.
పోతే వీటన్నిటికీ మకుటాయ మానమైన సన్నివేశం ఆఖరుసారిగా సీతాగ్ని ప్రవేశం. అగ్నిదేవుడే స్వయంగా ఆవిడను రాముడికి తెచ్చి సమర్పిస్తారు. వెంటనే అంతరిక్షంలో బ్రహ్మేంద్రాది దేవతలంతా స్వస్వరూపాలతో సాక్షాత్కరిస్తారు. రాముడి విరాడ్రూపాన్ని వేనోళ్ల కీర్తిస్తారు. అంతావిని రాముడు ఆత్మానమ్ మానుషమ్మన్యే రామం దశరథాత్మజమ్. - నేను దాశరథి అయిన రాముడను నన్నునేను మానవుడననే భావిస్తున్నాను. మీరేమిటి నన్ను భగవాను డంటున్నారు. అది ఎలాగో వివరించమని అడుగుతాడు.
Page 29