రాక్షస సంహారం చేశాడట. అవే తనకూ కావలసి వచ్చాయట ప్రస్తుతం. రాముడు భగవదవతారమని ఇక వేరుగా నిరూపించాలా. ఈ ఒక్క చిన్న సన్నివేశం చాలదా. చమత్కార మేమంటే అన్నీ తెలిసికూడా ఏమీ తెలియనట్టు అమాయకత్వం నటించడంలో ఉంది కథానాయకుడి ధూర్తత్వం. ఇది కృష్ణ పాత్రకన్నా ఎక్కువ ధూర్తత్వం.
తరువాత పంచవటికి వెళ్ళి అక్కడే నివసించమని సలహా ఇస్తాడు • మహర్షి ఆయుధా లివ్వటం అక్కడికి వెళ్లి ఉండమని చెప్పటం కూడా భావ్యర్థ ద్యోతకమే. అంతేకాదు. అక్కడికి వెళ్లారో లేదో జటాయువు ప్రత్యక్ష మవుతుంది. అది నేనుమీకు సహాయంగా ఉంటానంటుంది. ఇదందుర్గంహి కాంతారం - మృగరాక్షస సేవితం - సీతాంచాపిరక్షిష్యే -త్వయియాతే సలక్ష్మణే ఇది మహారణ్యం. రాక్షస సంచారమెక్కువ ఉంటుందిక్కడ. ఎప్పుడైనా నీవు లక్ష్మణుడితో ఎక్కడికైనా వెళ్లినా నీను నీదేవిని సీతను కాపాడుతానంటుంది. ఎంత సాభిప్రాయమైన మాట ఇది. ఇంత రాక్షసాకీర్ణమైన చోటికి వెళ్లమని ఆగస్త్యు డెందుకు సలహా ఇచ్చాడో ఇప్పుడర్థమయింది. ఇక్కడే ఉన్నారు ఖరదూషణాది రాక్షసులంతా. వారంతా రావణుడి పరివారం. తప్పకుండా వారితో ఘర్షణ ఏర్పడుతుం దక్కడ ఉంటూ ఉంటే. తద్వారా రావణుడికి వారి వృత్తాంతం తెలిసిపోతుంది. చివరకు వాడితోనూ పోరాటం రాకతప్పదు. ఇదంతా ఊహించే ఆగస్త్యుడాయుధా లిచ్చాడు. రాముడు మౌనంగా పరిగ్రహించాడు. ఆయన సలహామేర కక్కడికే వచ్చి పర్ణశాల వేసుకొని స్థిరంగా అక్కడ కాపురమున్నాడు. ఈ మౌనచర్యలో ఎంత మర్మమున్నదో చూస్తే మన కాశ్చర్యం వేస్తుంది.
ఇంకా ఆశ్చర్యమేమంటే ఖరదూషణాదు లెక్కడ తనమీది కెత్తి రారోనని శూర్పణఖతో ఎకసక్కాలాడి దానికి కోపం తెప్పించి లక్ష్మణుడిచేత దాని ముక్కు చెవులు కోయించి పంపటం. అది సరాసరి వెళ్లి ఖరదూషణాదులను యుద్ధానికి పురికొల్పింది. తద్వధానంతరం మరలా అదేగదా రావణుణ్ణి ప్రేరేపించింది.
Page 25