#


Index

  మొత్తం మీద కుంతి దగ్గర నుంచీ ఉద్దవుని దాకా సగుణ భక్తి అనేది ఏమిటో ఎలాంటిదో ఏకరువు పెడుతూ వచ్చాము. ఇందులో ఎన్నో భూమికలూ ఎంతో వ్యవహార ముంది. అది కూడా ఆయా వ్యక్తుల చిత్త వృత్తులనూ భక్తిలో వారి కుండే మంద మధ్యమ తీవ్ర తీవ్ర తరాది వేగాలనూ బట్టి నానా విధాలుగా మనకు దర్శన మిస్తుంది. అయితే ఎంత తీవ్రాతి తీవ్రమైనా ఇది సగుణమే ననే మాట మనం మరచి పోరాదు. కడకు అక్రూరోద్దవులది కూడా సగుణమే. పరమాత్మ వారి కెంత సన్నిహితుడైనా కావచ్చు. ఎన్ని శాస్త్ర రహస్యాలైనా బోధించి ఉండవచ్చు. సంసార తారణమే వాటన్నిటికీ ప్రయోజనమే కావచ్చు. అయినా అది సగుణ సీమ దాటి పోదు. కృష్ణ సందర్శనమే వారి ధ్యేయం. ఆయనతో సహ శయ్యాసనాది సుఖమే వారుకోరుకొనేది. ఆయన తోడి క్షణకాల విరహం కూడా వారికి సహస్ర యుగోపమం. గోపికలే కారు ఉద్ధవాదులే కారు. అందరికీ అదే పిచ్చి. అది భక్తిలో ఒక భూమికే గాని భక్తి సర్వస్వం కాదని తెలుసు పరమాత్మకు. అందుకే వారితో ఉన్నట్టే ఉండి అదృశ్య మవుతాడు. వారి నాదరించినట్టే ఆదరించి ఒక మందస్మితం చేసివారిని మరలా మాయలో పడ దోస్తాడు. ఈ మందహాసమే మహామోసం. నవ్వు రాజిల్లెడు మోమువా * డన్నట్టు ఇది ఒక అంతు పట్టని గుణం. ఈ గుణ జాల మొక ఇంద్ర జాలం మాదిరందరి మీదా ప్రయోగించి వారి మనో విహంగమాల నాజాలంలో బందీ చేయటంలో అందె వేసిన చేయి ఆయనది. ఇది తెలుసుకో లేక వారాయన మనవాడే గదా అని ఏమేమో కోరుతారు. ఇస్తాడని ఆశ పడతారు. ఇవ్వడూ. చేయడు. ఇచ్చినట్టు కనిపిస్తాడంతే. కనుకనే గోపికలను కలుసు కొంటానని చెప్పి మరలా కన్నెత్తి చూడలేదు. అక్రూరుని వీడ్కొలిపి మరలా ఆలోచించ లేదాతని సంగతి. ఒక్క ఉద్దవునికే ఏదో చెప్పినట్టు కనిపిస్తాడు. అది కూడా సగుణ భావన ఉన్నంత వరకూ పని చేయదు అపేక్షితమైన మోక్ష ఫల మందీయదు. కాబట్టి జీవిత శేష మంతా అంతవరకూ పట్టుకొన్న గుణ చింతనకు స్వస్తి చెప్పి తత్పరి పాక రూపమైన

Page 191