ఆ తెఱ గత డెఱిగిస్తే అక్కడ ఉన్న యాదవులు సదస్యులు + నారదుడు అందరూ ఆయన నభినందిస్తారట. అలా తన భక్తుణ్ణి నలుగురూ అభినందించాలనే అప్పటికా నంద నందనుడి ఆశయం.
మరలా ఇక ఉద్ధవుడు మనకు సకల యదువంశ సంక్షయమైన తరువాత గాని కనిపించడు. అదే ఇక ఆఖరుసారి కనిపించటం. యుగక్షయ మయిపోతున్నదిక నీవూ మాకు దూరమవుతున్నావు. నీదాసులమైన మాకేదైనా తరణోపాయం ప్రసాదించి పొమ్మని ప్రాధేయ పడతా డుద్దవుడు. దానికా నందాత్మజు డానందించి ఆయన కెవరికీ చెప్పని జ్ఞాన యోగ రహస్యాలన్నీ సోదాహరణంగా వర్ణించి చెప్పి చివరకు
గచ్ఛోద్దవ మయా దిష్టో - బదర్యాఖ్యమ్ మమాశ్రమమ్ తత్ర మత్పాద తీర్థోదే - స్నానో పస్పర్శనైశ్శుచిః ఈక్షయాలక నందాయా - విధూతా శేష కల్మషః వసానోవల్క లాన్యంగ వన్యభు క్సుఖనిస్సృహః తితిక్షు ర్త్వంద్వ మాత్రాణాం - సుశీల స్సంయ తేంద్రియః శాంత స్సమాహి తధియా జ్ఞాన విజ్ఞాన సంయుతః మయాను శిక్షితం యత్తే వివిక్త మను భావయన్ మయ్యా వేశిత వాక్చిత్తో - మద్ధర్మ నిరతో భవన్ అతిక్రమ్య గతీస్తి స్రో - మామేష్యసి తతః పరమ్
అని శేష జీవితం ఎలా గడపాలో ఉపదేశించి అలా గడిపితే అవసానం లో తన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుందని హామీఇచ్చి - సాగనంపుతాడు. అలాగే తన జీవిత శేషం బదరికాశ్రమంలో చరితార్థం చేసుకొని ఆ పరమా భాగవతుడు
యథోపదిష్టాం జగదేక బంధునా - తపస్స మా స్థాయ హరేరగాద్గతిమ్
ఇదీ ఉద్దవుడి భాగవత చరిత్ర, ఉద్దవుడి చరిత్ర హరి వంశంలో లేదు. అక్రూరుడి వృత్తాంత ముంది గాని అతని దౌత్య వ్యవహారం కానరాదు.
Page 190