పంపాడని చెప్పి వారి ననున యిస్తాడు. వారి మధుర భక్తి జనిత విధుర వచనాల నాలకిస్తూ కొన్ని మాసాలా వ్రజపురంలో గడపి తరువాత ప్రవ్రజితుడై మధురకే పయనమై వస్తాడు. కృష్ణుడికి వారి ప్రతి సందేశం వినిపిస్తాడు.
అక్రూరుడి లాగానే ఉద్ధవుడు కూడా యాదవకుల శ్రేష్ఠుడూ - విద్యా వరిష్ఠుడూ గుణ గణ జ్యేష్ఠుడే సందేహం లేదు. ఇరువురూ భగవద్భక్తి సాగరంలో కంఠ దఘ్నంగా మునిగిన వారే అనుమానం లేదు. అయినా విద్యావతులు కాని గోపికల నిసర్గ మధురమైన భక్తి భావమెంత నిర్వ్యాజమో ఎంత గాఢమో తెలుప దలచాడు వారికా ఈశ్వరుడు. భక్తిలోని గాఢత్వాని కొక్కటే నిదర్శన మది భగవ ద్వియోగా సహిష్ణుత. తన్నిమిత్తంగా సాగే నిష్ఠురోక్తులూ. ఇది మనకు గోపికల పట్టుననే కనిపిస్తుంది. మరి ఎక్కడా కనుపట్టదు. వారు కృష్ణ వియోగ మొక్క క్షణకాలం సహించరు. అక్రూరోద్ధ వుల నాడి పోసుకొన్న దందులకే. కడకు తమ ప్రాణ నాథుడైన కృష్ణుణ్ణి కూడా నిష్ఠురా లాడేందుకు వెనుదీయలేదా సుందరులు. వారి ప్రగాఢమైన భక్తి ఎలాంటిదో ప్రౌఢులైన ఉద్ధవాదులు కూడా గ్రహించాలనే పరమాత్మ వారి కలాటి సుకుమారమైన రాయబారం అప్పగించటం.
ఉద్ధవుడు మరలా మనకు కృష్ణుడు రాజుసూయ యాగానికి బయలు దేరే ముందు కనిపిస్తాడు. రాజ సూయానికి వెళ్లటమా - మానటమా అని తేల్చి చెప్పమని ఉద్ధవుని అడుగుతాడు కృష్ణుడు. పైగా “అనఘ చారిత్ర నీవు మా అక్షియుగము వంటి వాడవు- మనకు నవశ్య మగుచుఁ జేయఁ దగినట్టి కార్యంబుఁ జెప్పు" మని తనకు తెలిసినా ఆ భక్తుడికి మర్యాద ఇచ్చి మాట్లాడుతాడు. ఇది మర్యాద ఇవ్వట మయినా కావచ్చు. ఆయన భక్తి మర్యాద ఎంతటిదో పరీక్షించటమైనా కావచ్చు. ఆ భక్తుడెప్పుడో గమనించాడా మాటలలోని మర్మం. అతని పాదాంబు జంబుల మనంబున నిడుకొని వృద్ధాను మతంబుగా నాయెఱింగిన తెఱంగు విన్న వించెద నంటాడు.
Page 189