అలాంటి ఛద్మ రూపమైన దౌత్య మేదో చూచాము భారతంలో. అది ఛద్మ స్వభావులైన భారత వీరులకు తగినట్టే సాగిందక్కడ. అదే సాధు స్వభావుడైన ఒక భాగవతుడి ద్వారా నడిస్తే ఎలా ఉంటుందో చూపదలచా డిక్కడ మహాముని. అది క్రూర స్వభావుడిదైతే ఇది అక్రూర స్వభావుడిదీ రాయబారం. సాధు పలవ ఎలా మాటాడుతాడో మనకు తెలుసు. అదే ప్రస్తుతం సాధు శీలుడైన వాడెలా మాట్లాడుతాడో తెలుసుకోవలసి ఉంది. ఇందులో స్వార్థం లేదు. ఛద్మం లేదు. కేవల లోకహితమే ప్రయోజనం. భగవానుడి ఉద్యమమే అది. భగవద్దత్తాధి కారులైన లోక సంగ్రహ పరాయణు లది కూడా అదే. ఏత దర్ధ నిరూపణార్ధమే ఈ సన్నివేశం.
అక్రూరుడు మహా ప్రసాదమని కృష్ణుని వీడ్కొని కరిపు రాని కరిగి ధృత రాష్ట్రాదులనూ కుంతీ విదుర సమేతులైన పాండవేయులనూ ఇరువాగుల వారినీ కలుసు కొంటాడు. కొన్ని రోజూ లేదీ బయట పెట్టకుండా అలాగే ఉండిపోతాడు. కుంతి తమ పుట్టింటి వారి క్షేమ సమాచారాలన్నీ అడుగు తుంది. తన బిడ్డలకు కలిగిన ఆపదలన్నీ వలపోసుకొని బాధపడు తుంది. వారి ఆపదలను పాపటానికి కృష్ణు డిప్పటికైనా సంసిద్ధుడేనా అని ప్రశ్నిస్తుంది. అక్రూరుడు విదురునితో కలిసి ఆమె నోదార్చిన తరువాత ధృతరాష్ట్రుని కొలువు కూటంలో దర్శిస్తాడు. నలుగురూ వినేలాగా కొలువులో అత్యద్భుతంగా ఉపన్యసిస్తాడు. అది సంజయునిదీ గాదు. కృష్ణునిదీ గాదు. అక్రూరుని ఉపన్యాస మది. ఒక మహా భక్తుడూ విరక్తుడూ అయిన వాడు కేవల లోక హితం కోరి ఎలా ధాటిగా నిర్మొగమాటంగా చెబుతాడో అలా చెప్పాడు. ఈ రాజ్యధనాదులు శాశ్వతమని భ్రాంతి పడుతున్నావు ధృతరాష్ట్రా. మీన జీవన భూత మిళిత జల మిది. ఒక చేప మ్రింగి క్రక్కిన జల మింకొక చేప మ్రింగుతుంది. అదీ క్రక్కవలసిందే మరలా. కాబట్టి
నిందం బొందకు మయ్య ఈ తనువు తానిద్రా కళా దృష్టమౌ సందోహంబు విధఁబు- నిల్వదు సుమీ- జాత్యంధతం బొందియున్ మందప్రజ్ఞత నేల చేసెదవు సమ్యగ్ జ్ఞాన చక్షుండవై సందేహింపక యిమ్ము పాండవులకున్ సర్వం సహా భాగమున్
Page 184