సరేనని సర్ది చెబుతూనే ఆయనకు సంసార మోహాన్ని కీలు కొలుపుతూ ఆ పరమాత్మ ఆయన కొక ఉద్యోగాన్ని అప్పగిస్తాడు. అక్రూరా నీవు గుణవంతుడవు - పరమ భాగవతుడవు విగ్రహారాధనలు - తీర్థాట నాదులు - చేసే వారి కన్నా మత్పద భక్తులైన మీబోటి వారు చాలా గొప్పవారు. అలాంటి నీకొకపని అప్పగిస్తున్నాను. అది ఏమంటే పాండవులు మనకు బంధువులు. చాలా కావలసిన వారు. వారు తమ తండ్రిని కోలు పోయి హస్తినాపురానికి వచ్చి ఉన్నారు. వారి పెద తండ్రి ధృతరాష్ట్రుడు వారి నంత ప్రేమగా చూడటం లేదు. కాబట్టి నీవు నా తరఫున పోయి ధృతరాష్ట్రుడికి నా మాటగా బుద్ధిచెప్పి వారిని చక్కగా చూచేలాగా చేసి రమ్మని రాయబారిగా పంపుతాడు.
చూడండి. ఇది ఎంత చిత్రమైన కథో. అక్రూరు డెవరు. పాండవులెవరు. వారి దగ్గర కితడు రాయబారిగా వెళ్లట మేమిటి. భారత పాత్రలు పాండవులు. భాగవత పాత్ర అక్రూరుడు. ఒకరికొకరికి సంబంధమే లేదే. బట్ట తలలకు మోకాళ్లకు ముడిపెట్టినట్లున్న దిది. ఇదే మహర్షి కథా కల్పనా పాటవం. ముందే మనవి చేశాను. ఒకానొక సత్యాన్ని చాటటానికి సంకేతమే కథలని. అలాంటి సత్యాన్నే చాటుతున్నదిది. ఏమిటా సత్యం. భారతంలో సంజయుడి రాయబార మని ఒకటున్నది. అది కౌరవుల దగ్గరి నుంచి పాండవుల దగ్గరకు నడచిన రాయబారం. ధృతరాష్ట్రుడు తమ్ముని కొడుకులకు రాజ్య భాగ మివ్వదలచుకోలేదు. దుర్యోధనుని కంటే దుర్మార్గుడు ధృతరాష్ట్రుడు. అతడు పలువ అయితే ఇతడు సాధు పలువ. తీయని మాటలు చెప్పి ప్రాణాలు తీసే యత్నమిది. దానికి తగిన వాడినే ఎన్నుకొన్నాడు రాయబారిగా. వాడే సంజయుడా ముసలాయనకు నమ్మినబంటు. ప్రజ్ఞాచక్షుని మించిన అఖండ ప్రజ్ఞాశాలి. నెత్తురు కూడు తినేదాని కన్నా అయిదుగురూ కలిసి బిచ్చమెత్తుకొని బ్రతకటమే మీనడవడికి తగిన పని అని నిండు సభలో ధర్మరాజుకు సలహా ఇచ్చేటంత సాహసి అతడు.
Page 183