#


Index

  వీటి ద్వారానే వీటి వెనకాల దాగి ఉన్న ఆపరతత్త్వాన్ని అర్థం చేసుకోవాలి సాధకుడు. అది ఆ భగవదనుగ్రహం వల్లనే సిద్ధించాలి. ఇదే భక్తుడి కాంక్ష. అది కనిపెట్టిన పరమాత్మ వెంటనే తన రూపం మాపుచేసి ఎప్పటిలాగా రథంలో ఉన్నట్టు దర్శనమిస్తాడు. అక్రూరుడది చూచి రథాన్ని సమీపించగానే ఏమి టక్రూరా! ఎంతసేపయింది నీవు నదిలోకి వెళ్లి-ఇంత తడవక్కడ ఏమిచేస్తున్నా వెక్కడా లేనిచోద్యమేదైనా నీకక్కడ కనిపించిందా అని ఏమీ తెలియనట్టు ప్రశ్నిస్తాడు. అప్పుడా మహాభక్తుడదంతా భగవన్మాయేనని అర్థంచేసుకొని మహాత్మా!

నీలోన లేని చోద్యము - లే లోకము నందు జెప్పనీశ్వర నీటన్ నేలన్ - నింగిని నున్నవె

ఉన్న చోద్యాలన్నీ నీలోనే ఉన్నాయి పొమ్మంటాడు. భగవంతుని మర్మం భాగవతుడికే ఎఱుక. -మరి ఎవరికీ గాదనేందు కీదే నిదర్శనం. తరువాత మధురాప్రవేశమూ-కంసవధా జరుగుతాయి. అన్నీ కన్నులార చూచి అక్రూరుడు భగవ దంకిత సర్వ జీవనుడయి తన గృహంలోనే కాలక్షేపం చేస్తుంటాడు.

  ఆ తరువాత కొంత కాలానికి మరలా అక్రూరుడి దగ్గరకు స్వయంగా వస్తాడు కృష్ణుడు. భక్తు డెక్కడ ఉన్నా ఉండవచ్చు. భక్తి భావ మనేది నిశ్చలంగా ఉండాలే గాని భగవంతు డలాంటి భాగవతుడి కెప్పుడూ దూరం కాదు. వెతుక్కొంటూ వస్తా డక్కడికి. ఉద్దవుడితో కలిసి వచ్చాడు. ఉద్దవుడూ తన లాంటి మహా భక్తుడే. రాగానే ఉద్ధవుణ్ణి గాఢంగా కౌగిలిస్తా డ క్రూరుడు. భక్తి అనే సూత్రమెంత గాఢ మయిందో అది సజాతీయాన్ని సజాతీయంతో కలపటంలో ఎనలేని పటిమ గలది. తన ఇష్ట దైవతం పాదాలు తొడల మీదే ఇడుకొన్నా డక్రూరుడు. ఆయన పరతత్త్వ ప్రభావమూ - అవతార ప్రయోజనమూ నానా విధాల స్తోత్రం చేస్తాడు. “ఏ పుణ్యాతి శయ ప్రభా వముననో ఈ జన్మ మందిక్కడన్ నీ పాదంబులు గంటిని - నా భవ బంధాలు పాప” మని ప్రార్థిస్తాడు.

Page 182