తమ పనికి విఘాతం కలిగితే ఎంత సన్మార్గుడైనా వారి పాలిటికి దుర్మార్గుడు గానే కనిపిస్తాడు. ఇది కేవలం లోకుల దృష్టిమాత్రమే. అంత మాత్రాన ఒక సజ్జనుడు దుర్జనుడు కాడు. ఆయన సౌజన్య మెప్పుడూ సౌజన్యమే. అది లోకులకు తెలియదు. లోకేశ్వరుడైన పరమాత్మకే తెలిసినతత్త్వం.
అందుకే తన్ను నిత్యమూ అంటి పట్టుకొన్న గోపికలను లెక్కచేయక వారి పట్టు విడిపించుకొని పయన మయినా డక్రూరుడితో. దారిలో యమునా నది తారసిల్లింది. దిగి స్నానాదులు గావించి రామసహితుడై కృష్ణుడు రథంలో వచ్చి కూచుంటాడు. అక్రూరుడు కూడా నదిలో దిగి మజ్జనం చేసి వేద మంత్రాలు జపిస్తూ అలా చూచే సరికి జలమధ్యంలో రామకృష్ణుల రూపాలు కనిపిస్తాయి. ఇదేమిటి వీరు రథంలో గదా వెళ్లి కూచున్నారు. ఈ జలంలో కెప్పుడు వచ్చారని తలపయికెత్తి చూచేసరికి మరలా రథంలో కనిపిస్తారు. అశ్చర్యపోయి ఇంతకూ జలంలోనా, రథంలోనా అని మార్చి మార్చి చూడగానే ఇటూ అటూ కూడా ఏకకాలంలో గోచరిస్తారు. ఇది ఏదో దేవరహస్యం భేదించాలని మరలా శిరోదఘ్నంగా నీటిలో మునిగి చూచే సరికందులో అజస్ర సహస్ర ఫణా మండల మండితుడైన అదిశేషుడూ-అ శేషతల్పంమీద అనల్పప్రభా భాసురమైన పీతాంబరం ధరించి శిరస్సున కిరీటమూ-ఉరస్సున మహాలక్ష్మి – కరార విందములలో శంఖ చక్రాది దివ్యాయుధాలూ-పదార విందములలో దివ్యమణి నూపురాలూ దాల్చిన శ్రీమహవిష్ణువు దివ్యమంగళ రూపం సాక్షాత్కరిస్తుంది. అది చూచి తన జన్మ ధన్యమయిందని చెప్పి ఆ పురాణపురుషుని వేనోళ్ల పొగడుతా డక్రూరుడు. కలలం బోలెడి పుత్ర మిత్ర వనితా గా రాదులన్నీ ఎండ మావుల లాంటివి. అయినా వాటినే యధార్థమని నమ్మి ఇంతకాలమూ పరమార్థానికి దూరదూరంగానే ఉండిపోయాను. ఇది తత్త్వజ్ఞాన మెలా అవుతుంది. కనుక తత్త్వమేదో దాన్ని తెలుసుకొనేందుకు నాకు నీ పాద యుగం చూపమని ప్రార్థిస్తాడు. పాదయుగ మేదో గాదు. అది ఈ నామరూపాలే.
Page 181