#


Index

  కనుకనే మాపటి వేళ నేనుజని మాధవు పాద సమీప మందు దం డా పతి తుండ నైన - నతడా శుగ కాల భుజంగ వేగ సం తాపిత భక్త లోక భయ దారణ మైన కరాబ్జ మౌదలన్ మోపి హసించి నా కభయమున్ కృప తోడుత నీయ కుండునే

అని తనలో తానే సమాధానం చెప్పుకొంటాడా మహభక్తుడు. దాసుని తప్పులు దండంతో సరి అన్నారు పెద్దలు. శత్రువునైనా శరణంటే మన్నించే పరమాత్మ పాత్రుడైన వాడుపాద పతితుడైతే ఉపేక్షిస్తాడా. ఆమెలకువ తెలిసిన వాడక్రూరుడు. కనుకనే అలాంటి పవిత్రమైన అలోచన కలిగిందా మనసుకు.

  మనస్సును మించిన స్వదస్సుతో వెళ్లాడు ముందుకు. బృందావనం ప్రవేశించాడు. అక్కడ జలజాంకుశాది రేఖలు గల హరిపాదముల చొప్పు తిలకించాడు. భక్తిభావంతో పులకించాడు. అనతి దూరంలోతన సర్వస్వమైన రామకృష్ణుల దివ్యమూర్తులను దర్శించాడు. అవశుడై పోయి వారి పాదములను స్పృశించాడు. వారాయనను కౌగిలించుకొని బంధు మిత్రాదుల క్షేమ మడిగి వచ్చిన కార్య మెఱిగింపు మంటారు. ధనుర్యాగ విషయం విన్న విస్తాడక్రూరుడు. నిజమే అలాగే వెళ్లిచూడాలి తప్పదు గదా. పాలు పెరుగు నెయ్యి కట్నాలుగా కట్టి పెట్టండని హెచ్చరిస్తాడు గోపాలురను కృష్ణుడు. ఇంతలో గోపికలంతా అయ్యో అక్రూరుడు వచ్చి మన గోపాల కుమారుణ్ణి కొని పోతున్నాడే అని గగ్గోలు పడతారు. అక్రూరుడని పేరు పెట్టుకొన్నాడే గాని నిజాని కింతకన్నా క్రూరుడు లేడని ఆడిపోస్తారు. ఉఱుముఱిమి మంగలం మీద పడిందని చూడండి ఎలాంటి నీలాప నింద వచ్చిందో ఆ మహత్ముడికి. కంసుడిలాంటి క్రూరుడే అయన నక్రూరుడని అంతగా మెచ్చు కొంటే గోపికల లాంటి భక్తులే అయనను క్రూరుడని తిట్టిపోస్తున్నారు. అభక్తులచేతనే అక్రూరు డనిపించుకొన్నవాడు. పరమభక్తులకు క్రూరుడెలా అయినాడు. ఇదే మనవుల దృష్టి భేదం. ఎవరి దృష్టితోవారు చూస్తారు భాగవతుణ్ణి. ఆ చూడటం కూడా తమ ప్రయోజనాన్ని బట్టే. తమకు పనిబడితే దుర్మార్గులకు కూడా మనకు సన్మార్గుడనే బిరుదు నిచ్చి పూజిస్తారు.

Page 180