భక్తుడెప్పుడూ స్వతంత్రుడుకాడు. సర్వావస్థలలోనూ భగవదిచ్ఛానువర్తి అయి బ్రతుకు సాగిస్తుంటాడు. అది మంచి ఇది చెడ్డ అని చూడడు. చెడ్డ అయినా భగవదిచ్ఛ అయితే అది మంచే అతనిపాలికి. కనుక ఏది ఎప్పుడెలా జరుగుతున్నా ఎదురాడ రాదు. "నద్వేష్టి సంప్రవృత్తాని” అన్నట్టు దాని ననుసరిస్తూ పోవటమే భగవత్కైంకర్యంగా భావిస్తాడు. ఇలాంటి సేవా బుద్ధితోనే బయలుదేరాడు అక్రూరుడు. నంద గోకులం చేరాడు. చేరాడో ఇక కృష్ణ సందర్శనం తనక వశ్యంగా లభిస్తుంది గదా అని ఎంతో 5. మురిసిపోతాడు. అంతేకాదు.
సూరులు దొల్లియే విభుని శోభిత పాద నఖ ప్రభావళిం జేరి భవాంధకారములఁ జిక్కక దాటుదు-రట్టి దేవరన్ వైరము తోడనైన పిలువన్ ననుబంచి శుభంబుసేసె-ని ష్కారణమైన ప్రేమనిదె కంసుని బోలు సఖుండు గల్గునే
అని తంతే పూల పానుపు మీద పడ్డట్టు కంసుడే ఉద్దేశంతో చేసినా అది తన పాలిటి కొక మహా భాగ్యమని అనందిస్తాడు. ఇంకా ఆయన కొక అద్భుతమైన అలోచన వస్తుంది. "ఇతడా కంసుని చేత పంపువడి నన్ హింసింప నేతెంచినా డతి దుష్టుండని చూచునో” ఇంతకు పూర్వం పూతనాది రాక్షసు లెందరో కంసుని చేత పంపబడి వచ్చి అయన చేత చంపబడ్డారు. అలాగే వీడు కూడా కంసుని దూతగా వస్తున్నాడు- నన్ను హింసించటానికే మోనని నన్నుకూడా రూపుమాపడు గదా ఆపరమాత్మ అనిసందేహించి మరలా వెంటనే "సకల భూతాంతర్బహిర్మధ్య సంగతుడౌటం దలపోసి నన్ను సుజనుంగాఁజూచునో" అయినా నాకెందుకీ భయం-అయన పరమాత్మ గదా-సకల భూతాంతర్యామి అయిన ఆ మహత్ముడికి నా అంతరంగ మెలాంటిదో తెలియదా అని ధైర్యం తెచ్చుకొంటాడు. ఇందులో మొదటిది లౌకికమైన అలోచన. రెండవది భక్తుడికి కలిగే పరిశుద్ధభావన. ఇది ఆ మొదటిదాన్ని త్రోసి రాజని ముందుకు వస్తుంది. సాధకుని ముందుకు నడుపుతుంది.
Page 179