క్రూరుడైన కంసుడు కూడా ఆయనను అక్రూరడని సంబోధిస్తాడు. అలాంటి నీతో మైత్రి సలపటం ఎవరికైనా శ్రేయస్కరమే నంటాడు. క్రూర స్వభావుల వల్ల కూడా సేబాసని పించే ప్రశంసా పత్ర మందుకొన్నాడంటే అది ఎంత గొప్ప తనమో చెప్పబనిలేదు. పైగా మైత్రి సలుప వచ్చు నట. సజ్ఞను లెప్పుడూ ఇరుపక్షాల : వారికీ విహితంగానే ఉంటారు. పరస్పరం కారాలు మిరియాలు నూరుకొనే ఇరువాగుల వారు కూడా అలాంటి వారంటే ఎవరికి వారు తమ మనిషిగానే భావిస్తుంటారు. ఇది లోకసహజం. అయితే సజ్జనులు వారిని సత్కార్యాలకు నియోగిస్తే దుర్జనులు దుష్కార్యాలకు వాడుకొంటారు. అదీ లోక సహజమే. ఇది వారి సాధుత్వాని కొక కఠిన పరీక్ష కూడా.
ఇలాంటి పరీక్షే ప్రస్తుతమీ అక్రూరునికి కూడా ఎదురయింది. నారాయణుడే దేవతల కార్యార్ధమై యదు వంశంలో పుట్టినందుని ఇంట పెరుగుతున్నాడని విన్నాను. అన్న బలరాముడు కూడా అతనితోనే ఉన్నాడు. వారినిక్కడికి తీసుకురా-నేను వారి ప్రాణాలు తీయటానికి సిద్ధంగా ఉన్నానని చెబుతాడు కంసుడు. దానికా పరమ భాగవతుడిచ్చిన సమాధానమిది.
పంపినఁబోని వాడనె-నృపాలక- మానవు లెన్నఁ దమ్మునూ హింపరు- దైవయోగముల నించుక గానరు- తోచినట్లుని ష్కంపగతిం జరింతు రది కాదన వచ్చునె- ఈశ్వరేచ్ఛ ద ప్పింపగ రాదు నీ పగతు బిడ్డలఁ దెచ్చెదఁ బోయి వచ్చెదన్
చూడండి. ఇందులో ఎంతగంభీరమైన భావ మిమిడి ఉన్నదో. భగవత్సంకల్సమే సర్వమూ-మంచి అయినా చెడ్డ అయినా అంతా అయన ప్రణాళికే. అందుకే నీకి దుర్బుద్ధి పుట్టింది. బహుశా ఇది ఒక నెపంగా నీకు ధనుర్యాగం లోనే ఆయువు మూడి ఉంటుందాయన చేతిలో. అది ఈశ్వరేచ్చే అయినప్పుడలాగే కానీ. దానిని తప్పించటానికి మనమెవరం. ఆ ఈశ్వర సంకల్పానికి నేనూ ఒక సహకారినైతే అంతకన్నా కావలసిందేముంది. తప్పక అలాగే నడచుకొంటాను.
Page 178