ఇక అయోధ్యలో అడుగిడి నప్పుటి నుంచీ అభిషేక భంగమయ్యే దాకా నోరు మెదపలేదు రాముడు.. అభిషేకం చేయాలన్నా - మానాలన్నా - ఏ మల్లగుల్లాలుపడ్డా - అదంతా దశరథుడే. తన్మూలంగా ఏ హర్ష విషాదాల ననుభవించినా కైకేయీ మంథరలే. కౌసల్యా వసిష్ఠాదులే. అభిషేకం చేస్తానన్నా జవాబివ్వలేదు. చేయను పొమ్మన్నా ఇవ్వలేదు. తండ్రి రెండుసార్లు పిలిపించి మాటాడుతాడు రాముడితో. పౌరజానపదులంతా. అనుమోదించారు. నీకు యౌవ రాజ్య మప్పగిస్తానని ఒకమారు. పుష్యమీ నక్షత్రం రేపే శుభముహూర్తం అభిషేకిస్తానని మరొక మారు. ప్రకృతులంతా అభినందిస్తున్నారని చెప్పినప్పుడు రాముడు పొంగిపోనూలేదు భరతుడు రాకుండానే పట్టాభిషిక్తుణ్ణి చేస్తానంటే అదేమిటినాన్నా భరతుడేమి పాపం చేశాడు. అతణ్ణి రానీయండని అభ్యంతరం చెప్పనూలేదు. రెండు మాటలకూ తల ఊపి వెళ్ళిపోతాడు. పైగా తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా రాజుగారు రేపు నాకభిషేకం చేస్తారట. సీతా నేనూ ఈ రాత్రి ఉపవసించాలట. రేపు గదా అభిషేకం. మరి మాంగళిక విధులన్నీ చేయించమని అంటాడు. అది చూస్తే ఎలాగ జరిగేదికాదు గదా అని నిర్లక్ష్యంగా అన్నట్టు తోస్తుంది. దీనికి మెరుగుపెట్టినట్టు లక్షణుణ్ణి చూచి లక్ష్మణేమాం మాయాసార్థమ్ - ప్రశాధిత్వం వసుంధరాం – భుంక్ష్వభోగాం స్వమిష్టాన్ - రాజ్యఫలానిచ జీవితం చాలు రాజ్యంచ - త్వదర్థ మభికామయే నీవుకూడా నాతో పాటీ - రాజ్యభారాన్ని వహించు. రాజ్య భోగాలన్నీ అనుభవించు - నీ కోసమే గదా ఈ రాజ్యాన్ని కోరటం - అని అంటాడు. ఎంత హేళనగా ఎంత పట్టీ పట్టనట్టున్న మాటలో చూడండి ఇవి. ఎలాగూ జరిగే వ్యవహారం కాదిది. ముసలాయన పిచ్చేగాని ఈ అభిషేకం జరుగుతుందా పెడుతుందా నేనూ అనుభవించను. నీవూ అనుభవించవు. చివరకు భరతుడు కూడా అనుభవించేదిలేదు. పదునాలుగేండ్లూ ఎవరి ఆలనా పాలనా లేక ఊరక దైవా ధీనంగా ఉండబోయేదే సమస్తమూనని ఇంత భావ గాంభీర్యముంది ఈ మాటల్లో.
Page 18