#


Index

  ఆయన నెక్కడ లేని శాపనార్థాలు పెడతారు. “అక్రూరుండని పేరు పెట్టుకొని నేడస్మన్మనో వల్ల భుం జక్రిన్ మాకడఁ బాపి కొంచు నరుగన్ చర్చించి యేతెంచినా డక్రూరుండట క్రూరుడీత”డని తిట్టి పోస్తారు. “హరి నేలాకొని పోయె దంచు మన మా యక్రూరుఁ బ్రార్థింతమా” అని మరలా సామానికి దిగుతారు. ఇది కూడా పనిచేయక పోయే సరికి “మము గృపం బాటింపు గోవింద మాధవ దామోదర యంచు” సుజాతం బైన గీతంబులతో విలపిస్తారు. దానికీ లెక్కచేయక వారు వెళ్లిపోతుంటే “అదె చను చున్న వాడు ప్రియుడల్లదె తేరదె వైజయంతి” అని ఒకరి కొకరు వేలు పెట్టి చూపుతూ కండ్ల కబ్బినంత దూరం చూస్తూ నిలబడి పోతారు.

  ఏమిటిదంతా. సగుణ చింతనలో ఉన్న దౌల్బల్యమే ఇది. కనిపిస్తే ఆహ్లాదం. కనపడ కుంటే విషాదం. ఎప్పుడూ ఏక రూపంగా ఉండే స్థితి కాదిది. అలాంటి స్థితే కావాలంటే అది నిర్గుణం లోనే. సగుణంలో దొరకదా నిధానం. కనుకనే పెన్నిధి కోలుపోయిన పేదలలాగా కృష్ణుని సన్నిధి కోలుపోయిన గోపిక లోపికలు లేక చీకాకు పడసాగారు. మరలా వారి నేడిపించటానికా అన్నట్టు కృష్ణుడు వారి చెంత కుద్ధవుణ్ణి పంపుతాడు. “నాపై జిత్తము లెప్పుడున్ నిలుపుచున్ నారాకఁగాంక్షించుచున్ గోపాలాంగన లెంత జాలిఁబడిరో చూచి రమ్మని పంపుతాడు. పైగా “సందేహము మానుండర విందా ననలార మిమ్ము విడువను వత్తున్” “నాకాశ్రిత రక్షణములు నై సర్గికముల్” అని ఆయన ద్వారా తన హృదయాన్ని ఆవిష్కరిస్తూ వారికొక సందేశం పంపుతాడు. అయితే ఆయన వ్రేపల్లెకు వచ్చి ఆ సందేశ వచనాలు వారికి వినిపించే లోపలనే వారు సహనం కోలుపోయి వచ్చిన వాడినీ - పంపిన వాడినీ - ఎవరినైనదీ తెలియని దశలో దిశ దిశలూ మారు మోగే లాగా నానా విధాలైన నిష్ఠురోక్తులూ సాగిస్తారు. దగ్గరగా తిరుగుతూన్న ఒక భ్రమరం మీద నెపంపెట్టి ఎగ్గు లాడుతారు. "భ్రమరా దుర్జన మిత్ర ముట్టకుము ఎందుకని.

Page 174