#


Index

  అలాకాక వారికీ విశాల విశ్వమంతా భగవద్రూపమే ననే దృష్టి ఏర్పడాలంటే తాను తన రూపాన్ని ఉపసంహరించాలి. అప్పుడా రూపాన్ని చూడాలనే తహ తహతో సృష్టిలో ప్రతి ఒక్కటీ అన్వేషిస్తూ పోతాడు సాధకుడు. భగవదంతర్ధానాన్ని తమ కేర్పడిన మాన ధనాన్ని అపహరించి తమ కసలైన తత్త్వాన్ని చాటటంగా కూడ అర్థం చేసుకొంటారు. ఇదే అప్పు డప్పుడు కృష్ణుని అంతర్ధానంలో ఇమిడి ఉన్న ఆంతర్యం. వియోగానంత రోపనత మైనపుడే సంయోగంలోని విలువ గుర్తిస్తాడు సాధకుడు. అలాగే గుర్తించారు గోపికలు. తనివి దీఱ ఆయనతో రాసక్రీడాదుల నుభవించారు. రస సంబంధియే రాసం. రసో వైసః. రసం పరమాత్మ స్వరూపమే. తత్పాహ చర్యాన్ని అనుభవించటమే రాసక్రీడ. తన్మూలంగా కలిగే నిర్వృతి ఏదుందో అదే జలక్రీడ. జల మంటే ఉపశమనం. మౌనం. భగవత్సాహ చర్యాను భూతి చివరకు మౌనం తోనే పర్యవ సిస్తుందని చెప్పటమే రాసక్రీడా నంతర జలక్రీడా వర్ణనం.

  ఇలాంటి నిర్వాణ భూమిక నందుకొన్న తరువాత ఇక న్యాయమైతే వారక్కడి నుంచి తిరిగి రాకూడదు. అంటే తగ్గు స్థాయిలో కలిగే ఆలోచనలు మనసులో ప్రవేశించరాదు. అయినా ప్రవేశించాయా గోపికలకు. కారణం వారింకా సగుణ భూమికలో నుండటమే. నిర్గుణం లాగా భాసించే సగుణ భక్తి ఇది. జ్ఞానుల లాగా అప్పు డప్పు డుపన్యసించినా తదాభాసే గాని తత్త్వం కాదది. దీనిని బయట పెట్టటానికే అక్రూరాగమనం. కంసుని ఆదేశాన్ని శిరసావహంచి రామ కృష్ణులను తోడ్కొని పోవటానికి వచ్చా డక్రూరుడు. అది మహా క్రూరమైన చర్యగా కనిపించింది వారికి. కృష్ణుడు తమకు మరలా దూర మవుతున్నాడే అని వారి బాధ. దూరం కావాలను కొన్న వాడసలు కృష్ణుడే. తానే దూరం కావాలను కొని దానికి కంసుణ్ణి అక్రూరుణ్ణి ఒక నిమిత్తం చేసుకొన్నాడా పరమాత్మ. అది అల్పమేధసలైన ఆ గోపికల కంతు పట్టలేదు. పైగా అక్రూరుడే కావాలని తీసుకెళ్లు తున్నాడని

Page 173