ఆ నల్లని ముగ్ధమోహన రూపంతోనే కనిపించి తమ వియోగ వహ్ని చల్లార్చ మని బ్రతిమాలుతారు.
మరి ఆయన సామాన్యుడా. “యే యధామా మన్నట్టు” వారెంతో తానూ అంతే.
తను రావే యని చీరి యేడువ జగత్రాణుండు - త్రైలోక్య మో హనుడై మన్మథ మన్మథుం డయి- మనోజ్ఞా కారియై - హారియై ఘన పీతాంబుర ధారియై పొడమె
వారు కోరిన రూపంతోనే ప్రత్యక్ష మవుతాడు. వెంటనే తమ వల్లభుడు విచ్చేశాడని వికసిత ముఖులై ఆ సఖులు ఆయన కేలు పట్టుకొంటే ఒకతి చేయి భుజం మీద వేసుకొంటే - ఒకతె తాంబూల మాసిస్తే - మరొకతె ఆయన మృదులమైన పదాలు తన పరితప్త కుచాల మీద పాదు కొల్పుతుంది. ప్రేమాతి శయంతో నిష్ఠు రోక్తు లాడుతారు. అంతే కాదు.
కొలిచినఁ గొలుతురు కొందఱు
కొలుతురు తముఁ గొలువ కున్న కొందఱు పతులన్
అని సాభిప్రాయంగా మాట్లాడుతా రాయనతో. దాని కాయన జవాబిస్తూ "ఏనిం దెవ్వడ నైనంగాను-మానస బంధుడ - నిత్య ధ్యానము మీ కొసగ వలసి తలగితి" నని తన అంతర్థానంలోని అసలు రహస్యాన్ని బయట పెటతాడు. ఇంకా ఒక మంచి చురక పెడతాడు వారికి.
నను సేవించు నున్న వారలకు నేనా రూప ముం జూపఁ జూ చిన భావించి మదించి వారు మఱినన్ సేవింప రోయంచు
ఇది భగవానుడి భయం. ఒక విశిష్టమైన రూపంతో కనిపిస్తే ఇదే శాశ్వతం ఇంతకన్నా మరేమికాదు- మరి ఇదెప్పుడు మనతో తిరుగుతూ మన ఆధీనంలో ఉన్నదే గదా అనే సంకుచిత భావ మేర్పడు తుంది భాగవతులకు.
Page 172