ప్రకృతిలో ఏది చూచినా అది తమ దైవానికి ప్రతికృతే. ఆయన మూర్తిని పట్టి ఇచ్చే ప్రతీకమే. లేకుంటే
కొమ్మకు పువ్వులు గోసినాడిక్కడ మొనసి పాదాగ్రంబు మోపినాడు సతినెత్తు కొని వేడ్క జరిగినాడక్కడ - తృణములో లేదిదె తెఱవజాడ ఒక యెలనాగచే యూదినాడిక్కడ సరసనున్న వినాల్గు చరణములును ఒక నీలవేణితో నొదిగినా డిక్కడ- మగజాడలో నిదెమగువ జాడ అంటూ ఇలా ఎక్కడ బడితే అక్కడ భగవత్పద ముద్రలు దర్శన మీయవు వారికి. భక్తుడికీ ప్రపంచమంతా భగవ ద్విభూతే. తత్స్వ రూప ముద్రా ముద్రితమే. ఇందులో ఏ ముద్ర చూచినా అది ఆరూపాన్ని పట్టి ఇచ్చే గట్టి లాంఛనమే. అయితే అలా చూచే దృష్టి ఉండాలి సాధకుడికి. ఉన్ననాడిక సృష్టి అంతా స్రష్ట రూపమే మరేదీ గాదు. అలాంటి అంతర్దృష్టి తోనే దర్శించ గలిగా రాగోపికలు.
అలా దర్శించటంలో వారి కప్పు డప్పు డాయన కేవలమూ తమ్ము వలచి వలపించే వల్లభుడే కాదు. సకల జగ దంతర్యామి అయిన ఆ పరమాత్మేనని భావన కూడా ఉదయించేది. “నీవు యశోద బిడ్డడవె నీరజ నేత్ర సమస్త జంతు చేతో విదితాత్మ వీశుడవు - తొల్లి విరించి దలంచి లోక రక్షా విధ మాచరింపు మని సన్నుతి సేయగ సత్కులంబునన్ భూ వలయంబు గావ నిట పుట్టితి గాదె మనోహరా కృతిన్” ఒక ఆకృతి అంటూ లేని పరతత్త్వ మింత మనోజ్ఞమైన ఆకృతి ధరించి ఆవిర్భవించిం దంటే అది భూ భారావతార ణార్థమే నని ఎంతో ఆర్ష దృష్టి తమ కున్నట్టు కనిపిస్తారు. కాని అంతలోనే “నీ నగవులు నీ చూడ్కులు నీ నానా విహరణములు నీ ధ్యానంబుల్ నీ నర్మాలాపం బులు మానసములు నాటి నేడు మగుడవు కృష్ణా- నీ యధ రామృత సంసేవన విధి నంగజు తాప మెల్ల విడిపింపఁగదే" అని సగుణ భావనలో తల మునకలుగా మునిగి పోతారు.
Page 171