అందుకోస మున్నట్టుండి ఆయన వారి మధ్యలో నుంచి మాయ మయి పోయేవాడు. అది వారి అనన్యమైన భక్తి కొక పరీక్ష ఆయన దృష్టిలో. కాని వారి దృష్టిలో ప్రగాఢమైన విరహం. దానితో తపించి పోయి వారు “పున్నాగ కానవే పున్నాగ వందితు- తిలకంబ కానవే తిలక నిటలు” అని తమ ప్రాణ నాథుణ్ణి అక్కడా ఇక్కడా వెదకుతూ పోతారు. “నల్లని వాడు పద్మనయనంబుల వాడు-” అంటూ ఆయన చిరునామా చెప్పి ఇలాంటి వాడొకడు మా మానధనాన్ని దోచుకొని పోయాడు- మీ పొదల మాటున లేడు గదా చెప్పండని కనపడ్డ మల్లె తీవల నన్నింటినీ అడుగుతూ పోతారు. ఇంకా విరహోన్మాద మెక్కువయి “అదె నంద నందను డంతర్హి తుండయె - పాటలీ తరులార పట్ట రమ్మ - హేలా వతుల కృష్ణ యేల పాసితివని-యై లేయ లతలార యడుగరమ్మ" అని నోరులేని చెట్టులనూ గుట్టలనూ ప్రాధేయ పడేవారు. అంతే గాదు.
కిటియై కౌగిటఁ జేర్చెను వటుడై వర్ధిల్లి కొలిచె వడి కృష్ణుండై యిట పద చిహ్నములిడె- క్రిం దటి బామున నేమి నోచితమ్మ ధరిత్రీ
అని భూదేవి సౌభాగ్యానికి మురిసి పోతారు. ఇంకా వెట్టి తల కెక్కితే
పూతనయైయొక్క పొలతిచరింపంగ శౌరియై యొక కాంత చన్నుగుడుచు బాలుడై యొక భామ పాలకు నేడ్చుచో బండినేనని లేమ పాఱదన్ను. ఇలా కృష్ణుని బాల్య చేష్టలు తమ మీద ఆపాదించు కొని తృప్తి పడతారు.
సగుణో పాసకుల వ్యవహారమే ఇంత. అందులోనూ ఉపాసకులు స్త్రీలయినప్పు డిక చెప్పనే అక్కర లేదు. చేతనా చేతన వివేచన ఉండదు వారికి. తన్మ యత్వ మెక్కువయ్యే కొద్దీ చరా చర ప్రకృతి అంతా తమ ఉపాస్య దేవతా మయం గానే భాసిస్తుంది వారికి.
Page 170