ఆ కొలను సంసారమే. దానిలో నుంచి ఎంతగా పరమాత్మ హెచ్చరించినా బయట పడట మిష్టం లేదు వారికి. చివరకు పడక తప్పింది. కాదు. చేతు లెత్తమనికూడా అంటాడు. ఇదిమరీ అన్యాయంగా కనిపిస్తుంది. కాదు. చేతులతో గోప్యాంగాన్ని కప్పి పుచ్చు కొన్నారు వారు. పరమార్థంలో కప్పి పుచ్చుకో వలసిందేదీ లేదు. ఎందుకంటే సర్వత్రా ఉన్నాడీశ్వరుడు.. "అంతర్బ హిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః" అలాంటప్పుడు. కప్పిపుచ్చినా కనపడక పోదు గదా. ఇక ఏమిటి కప్పుకొనేది మనం. “తేనత్యక్తేన భుంజీథాః” అన్నట్టు మనకున్న సర్వమూ త్యజిస్తే గాని ఆ తత్త్వంతో సాయుజ్యాన్ని భజించలేము మనం. ఇదే ఈ కథలోని సారాంశం.
పోతే రాస క్రీడలు. జల క్రీడలు. ఇవన్నీ జీవేశ్వరుల సంసర్గమే. మరేదీ గాదు. అనన్యమైన సగుణ భక్తికిది పరసీమ. ఇందులోని ఆంతర్యం భాగవతమే బయట పెట్టింది. పరీక్షిత్తు లౌకికంగా భావించి ప్రశ్నిస్తే శుకుడు దాని కలౌకిక మైన స్థాయిలో సమాధాన మిస్తాడు. సర్వ భక్షకుడైన అగ్ని హోత్రుడికే దోషమూ ఎలా అంటదో పూర్ణ జ్ఞానైశ్వర్య సమన్వితుడైన పరమాత్మ కేవ్యవహారమూ అంటదు పొమ్మంటాడు. అలాంటి పరిపూర్ణత లేదు గనుకనే మనబోటి మానవులకే ఈ ధర్మా ధర్మాది విచికిత్స అని కూడా జవాబిస్తాడు. ఒకవేళ మానవుడు కూడా ఆ స్థాయి కెదగ గలిగితే మరీ మంచిదే. వాడికి లేదలాటి ద్వంద్వ ప్రసక్తి అని కూడా అర్థం చేసుకోవాలి మనం. కనుకనే తమ ప్రవర్తన గూర్చి కృష్ణు డాక్షేపించి నప్పుడు అన్ని ధర్మములూ తెలిసిన నీవేనా ఇలా మాటాడ వలసించ దని మరలా ఆయనను మందలిస్తారు గోపికలు. ఇంత ధైర్యంగా అన గలిగారంటే అది అనన్యమైన వారి మధుర భక్తికి నిదర్శనం.
ఇలాంటి భక్త్యావేశంతో ఆ గోపిక లెక్కడ బడితే అక్కడే ఆ పరమత్మను చూడ గలుగుతారు. ఆయన వియోగం క్షణ కాలం కూడా సహించలేరు. సర్వత్రా తన మూర్తిని దర్శించ వలసిన వారలా తపన చెందట మిష్టం లేదు పరమాత్మకు.
Page 169