అది సహజం గానే పురుషుడి కధీనమై పోతుంది. అతనికి వశపర్తి అవుతుంది. అతని ఇచ్చాను సారం నడుస్తుంది. ఒదుగుతుంది. కరుగుతుంది. కలిసి పోతుంది. అనిర్వచ నీయమైన ఆనందమిస్తుంది. పొందుతుంది. చివర కతడూ తాననే భేదం లేకుండా అభేదాన్నే భజిస్తుంది. లోకంలో చూచే ఈ వ్యవహారంలో ఎంత మాధుర్యముందో అదే సరిగా గోపికలకూ గోపికా వల్లభుడికీ మధ్య ఉన్న వ్యవహారంలో కూడా. అయితే ఇది మాధుర్యమే గాని భక్తి కాదు. అది మధురమూ భక్తి కూడా. కారణం. ఇది కేవలం లౌకికం. అది లోకోత్తరం. ఇక్కడ కేవలం స్త్రీ పురుషులమే మన మని శరీర ధర్మాలే చూస్తున్నారు. అక్కడ ఈ స్త్రీ నేనొక పరమ పురుషుణ్ణి భజించే భక్తురాల ననీ - ఆయనకే ఈ తనుధన మనః ప్రాణాలన్నీ సమర్పితమనే పరిపూర్ణ భక్తి భావంతో ప్రవర్తిస్తుంది. ఆ పురుషుడు కూడా అశరీరుడూ నిత్య ముక్తుడూ అయిన పరమ పురుషుడు కాబట్టి ప్రత్యేకంగా నేనొక స్త్రీ శరీరంతో భోగిస్తున్నాను- దీని మూలంగా నా కెనలేని నిర్వృతి కలుగు తున్నదనే సవిషయ భావంతో ఉండడు.
ఇలాంటి ఆంతర్య మిందులో ఇమిడి ఉంది గనుకనే ఇది మధుర భక్తి. ఇది లౌకికం కాదు - లోకోత్తరమని చెప్పాము. లోకోత్తరం గనుకనే మనకది అర్థం కాదు. అర్థం కాకపోతే దాని మాధుర్య మెలాంటిదో చవి చూడలేము. కాబట్టి మన కోసమని పురాణ కర్త దాన్ని లౌకికమైన స్థాయిలో వర్ణించ వలసి వచ్చింది. అలౌకి కానికి లౌకిక మనేది ప్రతి బింబమే గదా. అది బింబమైతే ఇది దానికి ప్రతిబింబం. ప్రతిబింబం వట్టిదే. మిథ్యాభూతమే. మిథ్యా భూతమైనా ఇది ఆ తథ్యమైన బింబాన్ని మనకు పట్టి ఇస్తుంది. ఒక పక్షి ఆకాశంలో ఎగురు తూంటే దాని నీడ మనకు నేల మీద కనిపిస్తుంది. ఇదే ఆ పక్షి కాదు. కాని అది కనిపించగానే పైకి చూస్తాము మనం.. ఎందుకు. ఈ నీడ ఎక్కడిదా అని. చూస్తే తప్పకుండా పైన ఎగిరే పక్షి కంట బడుతుంది. అప్పటికీ ప్రతి బింబమే గదా ఆ బింబాన్ని చూపింది
Page 167