#


Index

  ఇలా జీవించా రాగోపకులు. జల జాతాక్షుడు రాముడున్ నటనముల్ సల్పంగ గోపాలమూర్తులతోఁ గొల్చునిర్జరులు సంతోషించి వేణు స్వనంబులు గావించుచు కొమ్ము లూదుచు శిరంబుల్ ద్రిప్పుచున్ బాడుచు తిరుగు తుండేవారు. మాపాలికి బల కృష్ణులు భూపాలకులంచు నెగిరి బొబ్బిలిడుచు వారిని నేలమీద నడవ కుండా భుజాల మీద మోసుకొని పోయేవారు. ఆయన కేదైనా ఆపద జరిగిందంటే భరించ లేక తల్లడిల్లేవారు. కాళియుడు కృష్ణుని చుట్టివేసి నప్పుడా దృశ్యం చూచి ఇలా ఆక్రందన చేస్తారు.

  అదె మన కృష్ణునిం గఱచి యంతటఁ బోక భుజంగమంబు దు ర్మదమున మేనుఁ జుట్టుకొని మానక యున్నది - యింక నేమి సే యుద మెటఁ జొత్త మే పురుషు లోపుదు రీయహి నడ్డపెట్ట

నని పెద్దపెట్టున గోల పెట్టారు. అంతేకాదు. తమకెలాటి ఆపదలు వచ్చినా సరే ఆయనే రక్షకుడని భావించి మరలా మొద పెడతారు. “నీ పద పద్మంబులు గాని యొండెఱుగ మోపద్మాక్ష యోకృష్ణ మ్రొక్కెద మో రామ మహా పరాక్రమ” “నీ పాదంబులు నమ్మిన నాపద లెక్కడివి జనులకు నీ చుట్టాలకు నాపదల్గలుగునే - మేమెల్ల నీవార - మన్యాచారంబు లెఱుంగ మీశుడ" వని ఈశ్వర తత్త్వ మెంతో తెలిసిన వారిలాగా కూడా కనిపిస్తారు. ఇంతెందుకు. తెలుసునో తెలియదో ఆ పరమాత్మ తత్త్వం వారికి. మొత్తానికి కృష్ణ పరమాత్మే లోకంగా ఆయనే తమ జీవిత సర్వస్వంగా బ్రతికారా గోపకులు. "మన్మ నాభవ మద్భక్తో మద్యాజీ మాం న మస్కురు మయ్యర్పిత మనో బుద్ధిః" అన్న భగవద్వాణి కుదాహరణ ప్రాయం వారి జీవితం. అంతే గాదు. అన్యాచారంబు లెఱుంగ మని వారన్నట్టు అది కూడా “యే శాస్త్రవిధి ముత్సృజ్య య జంతే శ్రద్ధయాన్వితాః- అన్యేత్వేవ మజా వంతః శ్రుత్వాన్వేభ్య ఉపాసతే” అనే భగవద్వాక్యాని కనురూపమే.

  పోతే ఇలాంటి వ్యవహారమే గోపికలది కూడా. వారూ భగవదర్పిత సమస్త భావనలే. అయితే ఉపాధిలోనే తేడా ఇరువురికీ.

Page 165