అలాంటి వారిని పరమాత్మ ఎప్పుడూ తప్ప జూడడు. యే యథా మా మన్నట్టువారి ప్రపత్తికి తగినట్టే వారి నాదు కొంటాడు. ఒకనాడొక రాక్షసుడు గోగోప బాలుర నందరినీ మ్రింగుతా నని చెప్పి అజగరా కారుడై దారిలో పడి ఉంటాడు. గోపబాలురది చూచి కూడా
బకునిం జంపిన కృష్ణుడుండ మనకుం బామంచు చింతింపనే టికి రా పోదము దాటి బకు వెంటంజను కృష్ణు చేత కాకయది కౌటిల్యంబుతో మ్రింగు డున్
అని తమలో తాము సమాధానం చెప్పు కొంటూ నిర్భయంగా వెళ్లి పోతారు. పరమాత్మ అది చూచి అయ్యో వీరు “నిర్భయులై యెదుర్కొనిరి నేఁగల నంచు" అంచేత వీరి నుపేక్షింప రాదని చెప్పి దాని కడుపులో దూరి పెరిగి దాని కడుపు చించి వారిని కాపాడుతాడు. మరొక పర్యాయం బ్రహ్మ బాలురను మాయం చేస్తాడు. కృష్ణుడది కనిపెట్టి ఒక ఏడాది కాలం ఆ గోపకుల వేషాలు తానే ధరించి ఎవరికీ అంతు పట్టకుండా వ్యవహరిస్తాడు. బ్రహ్మ తన చర్యకు తానే సిగ్గు పడి కాళ్ల మీద పడి మన్నింప మని ప్రాధేయ పడతాడు. అంతేకాదు.
ఏలా బ్రహ్మ పదంబు వేదములకున్ వీక్షింపగా రాని ని న్నీ లోకంబున నీవనాంతరము నందీ మందలో - కృష్ణయం చాలా పాది సమస్త భావములు నీయందే సమర్పించు నీ వ్రేలం దొక్కని పాద రేణువులు పై వేష్టించినం జాలదే
అని వాపోతాడు. దీనిని బట్టి బ్రహ్మ పదంలో ఉన్నా బ్రహ్మ తత్త్వం అంతు పడుతుందని నమ్మకం లేదు. అంత కన్నా ఏ ఉన్నత పదంలో లేకపోయినా సామాన్యుడికే అది సులభం కావచ్చు. దానికి కారణమొక్కటే. అది అలాపాది సమస్త భావములూ అయన కర్పించి జీవించటమే. మరేదీ కాదు.
Page 164