#


Index

  వారినీ కర్మభూమిలో జన్మింప జేస్తాడా ఈశ్వరుడు. కర్మభూమిలో దేనికంటే ఇక్కడ దేవలోకంలో ఉండే భోగ భాగ్యాలూ లేవు. అణిమాద్యష్ట సిద్ధులూ లేవు. దీర్ఘ కాలిక మైన జీవితం కూడా లేదు. మీదు మిక్కిలి అడుగడుగునా ఆధ్యాత్మ కాది తాపాలూ క్లేశాలే తారసిల్లు తుంటాయి. అవి నిత్యమూ అనుభవిస్తేనే గాని జీవిత భోగాల మీద ఏవగింపు పుట్టదు వారికి. అయితే ఈ నిర్వేద మనేది ప్రతి లోమమే గాని అనులోమ మార్గం కాదు. అనులోమం భగవద్భక్తి. అది ఎలా లభిస్తుంది. ఎప్పుడో కష్టం వచ్చినప్పుడనే గాక కష్టంలో సుఖంలో అన్ని దశల్లో ప్రతి నిమిషమూ ఆ పరమత్మతో కలిసి మెలిసి కాపురం చేసినప్పుడే. అందుకే ఈ గోవ గోపికల జన్మ. అది కర్మ సమాధి పరాకాష్ఠ నందుకొన్న దేవజాతి భక్తి జ్ఞానాలలో శిక్షణ పొందటాని కని భూమి మీద ప్రభవించిన వ్యవహారం. దీని కనుగుణం గానే సాగింది వారి జీవిత వ్యవహారమంతా. గోపికల దొక రకంగా అయితే గోపకులది మరొక రకంగా.

  మొదట గోపకుల వృత్తాంతమే తీసుకొని చూతాము. కృష్ణుడితో పాటు పుట్టారు పెరిగారు వీరు. కృష్ణు డెక్కడో పుట్టినా వచ్చి పెరిగింది వీరి మధ్యనే. పరమాత్మ వెతుక్కుంటూ వచ్చా డప్పటికి తన భక్తజనాన్ని. లేకుంటే ఆయన ఎక్కడ ఉన్నాడో అర్థం చేసుకొనే తాహతు లేదు గదా వారికి. ఇలా తన సన్నిధానం వారి కనుగ్రహించటం వారి ప్రయత్నానికి చేయూత నీయటం. అది చక్కగా అందు కొన్నారా బాలురు.

  గోవల్లభుడ నేను గోవులు మీరని - వడి అంకె వై చుచు వంగి యాడు రాజనే భటులు మీరలురండు రండని-ప్రాభవంబున పెక్కు పనులుపనుచు ఇలా కృష్ణు డెలా పంచితే అలా పనులు చేస్తూ పసితనం నుంచీ ఆయనకు పరిచర్య చేస్తూ వచ్చారు. అంతేకాదు.

  కపులమై జలశాశి గట్టుదమా యని- కట్టుదు రడ్డంబు కాలువలకు మునులమై తపములు మొనయుదమా యని మౌనులై యుందురుమాటలేక

Page 162