#


Index

శపించినప్పుడే గౌతము డామెకు శాపమోక్షణం సూచించాడు రామ దర్శనం కలిగినప్పుడే గాని శాపం నివృత్తి కాదని. రాముడి రాకకోసం కనిపెట్టుకొని ఉన్నదావిడ. మరి విశ్వామిత్రుడివెంట ఆయన గారలా రాకపోతే ఎలాగ.

  పిమ్మట మిథిలలో జనకసమాగమం కలుగుతుంది. జనకుడు వారిని చూచి ఆశ్చర్యపడుతూ అడిగితే వారుచేసిన ఘనకార్యాలన్నీ వివరించి ధనుస్సు మీద వారికి మక్కువ ఉండి వచ్చారంటాడు. నిజానికి మక్కువ ఉన్నది తనకు. రాముడికి కాదు. అయినా ఈ మాట అన్నాడంటే పైకి లేనట్టు నటించినా లోపల రాముడికీ ఉందన్నమాట. అది విశ్వామిత్రుడికి తెలిసే అని ఉంటాడు జనకుడు దాని పూర్వ చరిత్ర అంతా ఏకరువు పెట్టి అలాంటి ఈ విల్లు రాముడెక్కు పెట్టగలిగితే సీతనిచ్చి పెండ్లి చేస్తానంటాడు. అంతావిని విశ్వామిత్రుడు ధనుర్దర్శయ రామాయ - మా రాముడికి ధనుస్సు చూపించవయ్యా చాలునంటాడు. వెంటనే అయిదువేల కింకరులు దాన్ని అష్ట చక్రమంజూషలో కొని రాగానే వత్సరామధనుః పశ్య - వెళ్ళి చూడు రామా ఆ ధనువునంటాడు మళ్లీ గురువుగారు. గురు హృదయం తెలిసిన శిష్యుడు మంజూషాం తామపావృత్య దృష్ట్వాధనురభాషత చూచాను గురుదేవా ఏమి చేయమంటారీ ధనువును తోలనమా పూరణమా ఏమి చేయమంటారని అడుగుతాడు. అలాగే నన్నాడోలేదో ఎక్కుపెట్టి లాగగానే దానిపాటికది విరిగిపోయింది విల్లు. చూడండి. తనకు తెలుసు దాన్ని ఆరోపించే శక్తి ఉందని. దానివల్ల సీత పాణిగ్రహణం కూడా కలుగుతుందని, అయినా ఆ గురువు మాట జవదాటనట్టు ఆయన మాటమీదనే నడచు కొన్నట్టు నటన.

  తరువాత దశరథాదులు రావటమూ వివాహమహోత్సవం జరగటమూ - అయోధ్యకు తరలిరావటమూ - ఎంతో జరిగింది. ఏ ఒక్క ఘట్టంలోనూ వారు వారు మాటాడుకో వలసిందే గాని రాముడు ఒక్క మాట మాటాడడు. అసలు మొదటి నుంచీ అంతే. అతి మిత భాషి,

Page 16