#


Index

  ఆయనను తీసు కెళ్లటానికి పితృ దేవతలు వస్తారు. వారితో కలిసి పోయి యథా పూర్వంగా యమలోకంలో తన అధికార స్థానాన్ని అలంకరిస్తా డాయన.

  చూడండి. ఇక్కడ మన మొక విషయం గమనించ వలసి ఉంది. కుంతి మొదలుకొని వీరంతా సగుణ భక్తులే గాని నిర్గుణ భక్తులు కారు. అంటే పరిపూర్ణ జ్ఞాన యోగులు కారని అర్ధం. అక్కడక్కడా వారికి జ్ఞాన వైరాగ్యాలు కలిగినట్టు వర్ణించినా అది సగుణ మైన జ్ఞానమే. తన్మూలంగా ఏర్పడిన ప్రాపంచిక విషయ పరాజ్ము ఖత్వమే. సమ్యగ్ జ్ఞాన రూపమైన అద్వైత దర్శనం కాదు. అద్వైత దర్శనమే అయితే కృష్ణా దేశ మనే మాట గాని వైకుంఠ చరణాంబుజ మని మాట గాని రాకూడదు. "వాసుదేవ స్సర్వమితి” అని విషయ జగత్తుతో సహా సర్వమూ తద్రూపంగానే భావించ వలసి నప్పుడిక కృష్ణు డేమిటి వైకుంఠు డేమిటి. అలా అంటే అది పరిచ్ఛిన్న మైన తత్త్వం. అఖండ తత్త్వం కాదు. అఖండాన్ని పట్టుకొంటేనే జ్ఞానం. దాని వల్లనే ముక్తి. అంత వరకూ ముక్తికి నోచు కోలేడు మానవుడు. ఎంతటి భక్తుడైనా నోచుకోలేడు. వాడు నోచుకొనేది కేవలమా మూర్తి తోడి సాయుజ్యమే. అదీ మోక్షమని ఎక్కడైనా పేర్కొంటే అది కేవలం సాపేక్షమైన మోక్షమే గాని నిరపేక్షం గాదు. ఇలాంటి సాపేక్ష ముక్తినే పడయగలిగారు పాండవులూ విదురుడూ. దీనికి తార్కాణ మొక్కటే. వారు చివరకు ధారణా ధ్యాన సమాధి రూపమైన యోగ మార్గం లోనే శరీర త్యాగం చేశారు. అంతేగాదు. వారు ఉత్రమణ చెంది పోయి చేరింది వారివారి పూర్వ స్థానాలేవో అవేగాని సర్వాత్మ భావం కాదు. సర్వాత్మ భావ మనేది పూర్ణ జ్ఞానం వల్లనే పొంద గలిగేది. అప్పుడు వాడి కుత్రమణా లేదు ఎక్కడికో పోయి చేరటమూ లేదు., “నతస్య ప్రాణా ఉత్రామంతి - ఇహైవ సమవ నీయంతే” అని శాస్త్రం. అంచేత "ప్రేమన్ మీరలు” అని నారదుడు చెప్పినట్టుగా పాండవులది కేవలం భగవత్ప్రేమరూపమైన సగుణ భక్తే.

Page 159