అంతకు ముందే విరక్తు డయినాడు ధర్మజుడు.
యయా హరద్భువో భారం తాం తనుం విజహా వజః కంటకం కంటకేనేవ - ద్వయం చాపీశితు స్సమమ్ యథా మత్స్యాది రూపాణి ధత్తే - జహ్యాద్యథానటః భూ భారః క్షపితో యేన - జహౌ తచ్చ కళేబరమ్
మత్స్యాది శరీరాలు ధరించటం పరమాత్మ కొక లీల. భారావతారణమే వాటి ప్రయోజనం. ముల్లు ముల్లుతో తీసి తరువాత ఆ రెండు ముండ్లూ పారవైచిన ట్లొక శరీరమెత్తి మిగతా శరీరాలను నిర్మూలించి ఆ తరువాత రెంటినీ వదలి వేసి పోయాడాయన కవి రెండూ సమానమే. అని అర్జునుడనే మాటలు గాటంగా నాటాయి ధర్మరాజునకు. ఇక ఏ మాత్ర మాలసించినా అది పామరత్వమే నని భావించాడు. తాము నమ్ము కొన్న విలువైన సొమ్మే కాల ప్రవాహంలో నష్టమై పోయింది. ఇక తాముండి సాధించే దేముంది. వెంటనే తీవ్రమైన వైరాగ్య భావంతో తమ్ములూ తానూ పరీక్షిత్తును రాజ్యాభిషిక్తుణ్ణి చేసి సర్వమూ పరిత్యజించి ఉత్తర దిశగా పయన మవుతాడు. అంతకు పూర్వమే వారి తల్లి కుంతి యోగంతో శరీర త్యాగం చేసింది. తాము కూడా “మనసా ధారయా మాసు ర్వైకుంఠ చరణాంబుజమ్” మనసులో వైకుంఠుని మూర్తిని నిలుపుకొని "తస్మిన్ నారాయణ పదే” ఆ నారాయణుని మార్గంలోనే “ఏ కాంత మతయో గతి మవాపుః” అనన్య మనస్కులే అన్య జన దుర్లభమైన ఉత్తమ గతి చెందారట.
విధూత కల్మషే స్థానే విరజే నాత్మ నైవహి-విదురోపి పరిత్యజ్య ప్రభాసే దేహ మాత్మవాన్ కృష్ణా దేశేన తచ్చిత్తః-పితృభిః స్వక్షయమ్ యయౌ”
వారి పినతండ్రి విదురుడు కూడా అక్కడక్కడా తీర్థ యాత్రలు చేస్తూ వచ్చి వచ్చి చివరకు ప్రభాస మనే తీర్థంలో మునిగి దేహ త్యాగం చేస్తాడట.
Page 158