అంతేగాదు, అతడు తమ బావ అని- తమ ల నేదో ఆవత్సమయా లలో ఆదుకొంటూ వచ్చిన ఆపద్భాంధవుడనే సంకుచిత భావం కూడా అతనికి తొలగిపోయింది. అది అతని మాటలలోనే మనకు దాఖలా అవుతుంది.
భూతముల వలన నెప్పుడు భూతములకు జన్మ మరణ పోషణములు ని ర్ణీతములు సేయు చుండును భూతమయుం డీశ్వరుండు భూత శరణ్యా
సకల చరాచర సృష్టి స్థితి లయాలూ ఆ పరమేశ్వరుడి చేతి లోనివి. చరాచర భూతమయుడూ ఆయనే వాటి కతీతుడూ ఆయనే. మన మంతా కేవలం నిమిత్త మాత్రులమే నని తన పరా వర విజ్ఞానాన్ని ప్రదర్శిస్తాడు అర్జునుడు. అంతమాత్రమే గాదు. అంతకు ముందు భగవత్సన్నిధిలో ఎంత గీతా శ్రవణం చేసినా ఒంట బట్టని ఆత్మ జ్ఞాన మిప్పుడాయన అసన్నిధి లోనే పాకానికి వచ్చింది.
"వాసుదేవాం ఘ్రాను ధ్యాన పరి బృంహిత రంహసా-భక్త్యా నిర్మథితాశేష కషాయ ధిషణో 2ర్జునః-గీతమ్ భగవతా జ్ఞానం - యత్తత్సంగ్రామ మూర్ధని కాల కర్మ తమోరుద్ధమ్- పున రధ్యగమద్విభుః-
నిరంతర భగవచ్చింతా ప్రభావంవల్ల అతనికి పట్టిన మనః కాలుష్య మంతా ప్రక్షాళితమై పోయింది. అంతకు పూర్వ మెప్పుడో రణరంగంలో విన్న గీతోపదేశం కాలకర్మముల ప్రాబల్యం చేత మరుగు పడిన దంతా ఒక్క సారిగా మనసుకు స్ఫురించింది. “విశోకో బ్రహ్మ సంపత్త్యా సంభిన్న ద్వైత సంశయః" దానితో బ్రహ్మాకార వృత్తి నిలకడ చెందగా సంశయ శోకాలు రెండూ నశించి నిర్మల జ్ఞాన సంపన్ను డవుతా డతడు.
Page 157