తమ కర్తృత్వంతో ఏదో సాధించామనీ పడబొడిచామనీ అనుకొన్న దంతా వట్టి భ్రమే. అందుకు నిదర్శనం కృష్ణుడు వెళ్లిపోగానే తన అసహాయ స్థితి. అశక్తత. “మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్త మాత్రమ్ భవ సవ్య సాచి" అన్న భగవ ద్వాక్యం కూడా వట్టి సిద్ధాంతం కాదు - దృష్టాంత మని అప్పు డర్థ మయిందా మానవుడికి.
ఎంత పలవించినా ఇక ప్రయోజనం లేదని చెప్పి రామకృష్ణాదుల శరీరాల కగ్ని సంస్కారం చేసి బయలు దేరుతా డర్జునుడు హస్తినాపురానికి. పదహారు వేల మంది కృష్ణ కాంతలను కూడా వెంట బెట్టుకొని వస్తాడు. వచ్చీ రావటంతోనే అన్న గారి కాళ్ల మీద బడి బోరు మని ఆక్రందనం చేస్తాడు. ఇంగిజ్ఞుడైన ధర్మజుడా ఆకృతిని చూడగానే భయపడతా డేదో కొంప మునిగిందని. మరేదోగాదు. మాధవుని మరణమే. అందుకే ఆతుర్దాగా అడుగుతాడు.
అన్నా ఫల్గున భక్త వత్సలుడు బ్రహ్మణ్యుండు గోవిందుడా పన్నా నీక శరణ్యు డీశుడు జగద్భద్రాసు సంధాయి శ్రీ మన్న వ్యాంబుజ పత్ర నేత్రుడు సుధర్మా మధ్య పీఠంబు నం దున్నాడా బల భద్రు గూడి సుఖియై యుత్సాహియై ద్వారకన్
ఉత్సాహియై ఉన్న మాట వాస్తవమే గాని అది ద్వారకలో గాదు వైకుంఠంలో. ఆ మాటే చెబుతా డర్జును డిం కెక్కడి కృష్ణు డెక్కడి ద్వారక.
బలహీనాంగులకున్ బలాధికులకున్ ప్రత్యర్థి భావోద్యమం బులు కల్పించి వినాశము న్నెఱపి ఈ భూభారముం బాపి ని శ్చల వృత్తిం గృత కార్యుడై చనియె నా సర్వేశ్వరుం
డని అసలు విషయం బయట పెడుతాడు. కృష్ణుడంటే సర్వేశ్వరుడని-కేవలం భూభార పరిహారార్థమే అవత రించాడని పూర్తిగా గ్రహించా డర్జునుడు.
Page 156