#


Index

  పాపమంటదని శాస్త్రం చెప్పినా అది కేవలం సమర్థించ టానికి చెప్పిన మాటేనని పొరబాటు పడతాడు. అశ్వమేధాది యాగానుష్ఠానంతో పాపం నిర్మూలమై పోతుందనే మాట కూడ పాడి గాదు. అది పంకంబున పంకిల స్థలమునకూ మద్యంబున మద్య భాండంబునకూ గలిగే శుద్ధి లాంటి దేనని ఆక్షేపిస్తాడు. జీవహింసతో గూడిన యాగ కర్మల చేత మానవునికి పాప బాహుళ్యమే గాని పాప నిర్ముక్తి ఎలా కలుగుతుందని ప్రశ్నిస్తాడు. వాటన్నిటికీ భీష్ముడతని కొకే ఒక సమాధానమిస్తాడు. “ఈశ్వరుండు విష్ణు డెవ్వేళ నెవ్వని కేమి సేయు - పురుషుడేమి యెఱుగు-నతని మాయలకు మహాత్ములు విద్వాంసు లడగి మెలగుచుందు రంధులగుచు" ఇవీన్న నీ ప్రయోజకత్వ మని భ్రాంతి పడుతున్నావు. నీ కిందులో ఎలాంటి కర్తృత్వమూ లేదు. అన్నీ ఆ మహాత్ముడి మాయా విలాసమే అని ప్రబోధిస్తాడు. ధర్మరాజు కప్పటినుంచీ జ్ఞానం కొంత ఒంటబట్టి ఈశ్వరాధీనుడై బ్రతుకు సాగిస్తూ పోతాడు.

  ఇంతకూ వీరందరూ మార్జార కిశోరాలే. మర్కట కిశోరాలుగారు. మార్జార కిశోరం తల్లి ఆలనా పాలనే కోరుతుంది. మర్కట కిశోరం లాగా తాను దాని నంటి పట్టుకొనే ప్రయత్నం చేయదు. పైగా నామ రూపాత్మకం గానే భగవతత్త్వాన్ని భావించటం వల్ల ఆ మూర్తి ఎప్పుడూ తమతో ఉండాలనీ తమ పనులు చేసి పెడుతుండాలని కాంక్షిస్తుంటారు. తత్త్వం తెలిసి కాదది. తమ కాతత్త్వం ఉపయోగ పడుతుందని. తన్ని మిత్తంగానే ఆ ప్రేమ భావం. ఒక నిమిత్తంగా ఏర్పడిందెప్పుడూ ఆ నిమిత్తం పోతే తొలగి పోయే ప్రమాద ముంది. ఇలాంటి ప్రమాదానికే గురి కావలసి వచ్చింది పాండవులు. ఉన్నట్టుండి ఒక్కసారిగా మాయమైపోయాడు పరమాత్మ. దానితో పాటు ఆయన సహకారం కూడా కరవయి పోయింది వారికి. ఇది వారికి భగవానుడు పెట్టిన పరీక్ష. ఈ రెంటికోసమే నా మీరు నన్ను ప్రేమించటం భజించటం - లేక ఇవి దూరమైనా నన్ను భజించే నేర్పున్నదా మీకని మౌనంగా ఆయన వేసిన ప్రశ్న. అదే కృష్ణ నిర్యాణం.

Page 154