వెంటనే ఇలా చీవాట్లు పెడతాడు. "శ్రావితస్త్వమ్ మయా గుహ్యమ్-జ్ఞాపితశ్చ సనాతనమ్” నీకు నేనెంతో గొప్ప రహస్యాన్ని బోధించాను. పరమ సత్యాన్నే తెలియ జెప్పాను.
అబుద్ధ్యా నాగ్ర హీర్యత్త్వమ్ - తన్మే సుమహ దప్రియమ్
అది నీ మనసుకు పట్టలేదంటే ఎంత బుద్ధి హీనుడవో నీవు. ఇలాంటి వ్యవహారం నాకే మాత్రమూ పనికిరాదు. అసలు భగవద్గీతారంభంలో కూడా అర్జునుణ్ణి ఇలాగే చీవాట్లు పెట్టాడు.
అశోచ్యా నన్వ శోచస్త్వమ్ - ప్రజ్ఞా వాదాంశ్చ భాషసే
నిజమైన ప్రజ్ఞ లేకున్నా ప్రజ్ఞలు పలికితే ఒప్పుకోడు భగవానుడు. జిజ్ఞాసతో విషయం తెలుసు కోటానికి ప్రయత్నించాలి మానవుడు. అదే ఆత్మోద్ధరణకు తోడ్పడేది. అప్పుడే భగవంతుడు కూడా చేయూత నిచ్చేది. కుంతిలాగే అర్జునుడి కలాంటి స్తిమితత లేదు. ఇంకా అది అంతో ఇంతో ఉన్నవాడు ధర్మరాజు. కృష్ణుడి వల్ల కాకపోయినా భీష్ముడి వల్ల విన్నాడత డెన్నో ధర్మాలు. భగవద్గీత అర్జునుడు వింటే తత్తుల్యమైన మోక్ష ధర్మాన్నే శ్రవణం చేశాడు. చేసినందుకు తగిన పరిపాకం కూడా గడించాడు.
అయితే పామరత్వ మనేది అతణ్ణి వదల లేదు. అదీ కొంచె మంటి పట్టుకొనే ఉంది. పట్టువదలకనే.
తన దేహంబునకై యనేక మృగ సంతా నంబుఁ జంపించు దు ర్జను భంగిన్ గురు బాలక ద్విజ తనూజ భ్రాతృ సంఘంబుని ట్లనిఁ జంపించిన పాప కర్మునకు - రాజ్యా కాంక్షికిన్ నాకుహా యనల క్షావధినైన ఘోర నరక వ్యాసంగ ముల్ మానునే
అని వాపోతాడు. రణరంగంలో జరిగిన మారణ హోమ మంతా తన వల్లనే జరిగిందని అతని భ్రాంతి. పైగా ధర్మ యుద్ధం వల్ల రాజులకు
Page 153