శుద్ధి ఉండాలి. ఎలాంటి వ్యాజమూ పనికి రాదు. అంతా తెలిసినట్టు నటించటమూ - తన జీవిత ప్రయోజనాల కోస మర్థించటమూ- ఇదీ వ్యాజ మంటే. ఇవి రెండూ ప్రస్తుతం కుంతీదేవికి లేకపోలేదు. కావలసి నంత ఉంది. “పురుషుండాఢ్యుడు ప్రకృతికి పరుడని” భగవానుడి పరతత్త్వాన్ని ఎంత గానో కొనియాడింది. అంత విషయం తెలిసిన మనిషి కిక మోహ మెక్కడిది. లేకుంటే మరలా నాకు మోహవిచ్ఛేదము సేయమని ప్రార్థించట మేమిటి. అంతేకాదు. కృష్ణుడు తన వారినీ తన్నూ మొదటి నుంచీ ఎలా కాపాడుతూ వచ్చాడో ప్రశంసిస్తూ అలాగే ఇక మీదట కూడా మమ్మల్ను కంటికి రెప్పలాగా కాపాడుతూ మా ఇంటనే ఉండి పొమ్మంటుంది. ఇది ఇంకా అవివేకం. ఆపదలలో కాపాడితేనే పరమాత్మ అవసరం. లేకుంటే అక్కర లేదనే భావానికి కొంత తావున్న దీమాటలలో. పైగా తాను చేసుకోవలసిన మోహ విచ్చేదం పరమాత్మ కప్పగించట మేమిటి. సర్వవ్యాపకుడైన ఆ దేవుని తన దగ్గరే కట్టి వేసుకొనే అభిలాష ఏమిటి. సగుణంలో ఇది చాలా క్రింది స్థాయికి చెందిన ఆర్తభక్తి. కనుకనే సర్వజ్ఞుడైన పరమాత్మ ఆవిడ ఎంత దీనాలాపాలు చేస్తున్నా ఒక్క నవ్వు నవ్వి వెంటనే రథ మెక్కి వెళ్లి పోయాడు. మోహం వదలించమని ఆవిడ కోరితే మోహాన్ని ఆపాదించి పోయాడు. ఆయనకు తెలుసు నావిడ మనస్తత్త్వం. దానికి తగినట్టే ఉందాయన ప్రవర్తన. పిండికొద్దీ రొట్టె.
“యే యథామాం ప్రపద్యంతే తాంస్త ధైవ భజామ్యహ” మని తానే గదా చెప్పాడు. మేనత్త అంతస్తుకు తగినట్టే ఉంది మేనల్లుడి వ్యవహారం.
కుంతి అయిన తరువాత పాండవులు. ఆవిడ కుమారులే వీరు. ఆవిడ మేనల్లుడని చూస్తే వీరూ బావగారనే భావం వదలకుండానే చూచా రాయనను. మహా అయితే ఆయా సమయాల్లో ఆర్తత్రాణ పరాయణుడుగా భావించారు. ఒక్కొక్కప్పుడు భగవంతుడనే భావం కూడా ఉంది. లేకపోలేదు.
Page 150