భగవంతుణ్ణి ప్రాధేయపడ నక్కర లేదు. మనం ప్రాధేయ పడినా ఇంకా మనకు యోగ్యత లేకపోతే భగవంతుడు సర్వ సమర్థుడయి కూడా మనకది ప్రసాదించబోడు. మీదు మిక్కిలి ఇంకా మన కది బలం చేసి పోతాడు. ప్రస్తుతం కుంతి విషయంలో ఇలాగే జరిగింది. నాకు మోహ విచ్ఛేదం చేయమని ఆవిడ ప్రార్థిస్తే విచ్ఛేదం చేయక పోగా దాన్ని ద్విగుణీకృతంగా ఆవహించా డావిడకు శ్రీకృష్ణుడు.
పృథయేత్థామ్ కలపదైః - పరిణూతాఖిలోదయః మందమ్ జహాస వైకుంఠో - మోహయన్నివ మాయయా
ఈ విధంగా మేనత్త అవీ ఇవీ వలపోస్తూ ఉంటే ఏమీ మాట్లాకుండా ఒక మందహాసం చేసి వెంటనే రథమెక్కి ద్వారకకు వెళ్లిపోయాడట. ఆవిడ అన్ని విధాల ప్రాధేయ పడుతూంటే దానికి మందహాసమా జవాబు. పైగా ఇంకా కొంత కాల మిక్కడనే సన్నిధి చేసి మాకు తరణోపాయం బోధించమని ఆవిడ బ్రతిమాలు తుంటే దానికి ఏమీ బదులు చెప్పక రథారోహణం చేసి పోవటమా అంతకన్నా జవాబు.
అవును. నిజమాలోచిస్తే పరమాత్మ దృష్టిలో అదే జవాబు. జీవుడికి దేవుడిచ్చే జవాబదే. ఇచ్చట కుంతిది అనన్య మైన నిర్గుణ భక్తి కాదు. సగుణ భక్తి. పరమాత్మ నేదో ఒక పరిచ్ఛిన్న మైన రూపంలో చూచి దాన్నే కలకాలమూ తన దగ్గర నిలుపు కోవాలని కోరుతున్నది. పైగా స్వప్రయత్న మేకొంచెమూ లేకుండా తన సంగతి అంతా చివరకు తనకు కలగ వలసిన మోక్షం కూడా ఆయనే ప్రసాదించా లని ఆసిస్తున్నది. ఇది వట్టి పేరాస. భక్తి మార్గంలో దీన్ని మార్జార కిశోర న్యాయమంటారు. ఒక పిల్లి తన పిల్లలను తానే నోట గరచుకొని పోతుంది. పిల్లల కేమీ జవాబు దారీ లేదు. అంతా తల్లిదే. అలాగే భక్తుడి బాగోగులన్నీ భగవంతుడే చూచుకోవాలనే సిద్ధాంత మిది. మంచిదే. కాని దానికి కూడా నూటికి నూరు పాళ్లూ చిత్త
Page 149