ఏది చేసినా అది ఒక లీల ఆయనకు. ఏమటది. లోక విద్రోహులైన దానవులను శిక్షించట మొకటి. లోకోత్తరులైన దేవతాదులను రక్షించట మొకటి. అంతేకాక మహాజ్ఞానులైన వారికి నిర్వాణ సుఖం కూడా ప్రసాదించ గల దయామయుడు భగవానుడు. అంతటి దయాళుడవు గనుకనే నా భవలతలను కూడా త్రుంచి వేయమని బ్రతిమాలుతున్నది. భవబంధములను త్రుంచి వేసే భారం భగవంతుడి మీద పెడుతున్న దావిడ. భగవంతుడు గాదు త్రుంచి వేయవలసింది. ఎవడి బంధం వాడే త్రుంచుకోవలసి ఉంది. “ఉద్ధరే దాత్మ నా త్మానమ్.” ఆత్మోద్ధరణకు చేయవలసిన ప్రయత్న మంతా జీవుడిదే. దేవుడిది గాదు. స్వప్రయత్నం లేకుండా ఈశ్వరుడు తానుగా ఎవ్వరికీ మోక్షాన్ని ప్రసాదించడు. ఏమిటా ప్రయత్నం. తన కనాది సిద్ధంగా ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టు కోటం. జ్ఞానం వల్ల గాని సంభవం కాదది. కాబట్టి ఆత్మజ్ఞానం కోస మెవరికి వారు ప్రయత్నిం సాగిస్తూ పోవాలి. అలాంటి ప్రయత్నం లేదు కుంతికి. అందుకు కూడ నాకు శక్తి లేదు నీవే దాని ననుగ్రహించమని అడుగుతున్నది. "యాదవు లందు - పాండవుల యందు నధీశ్వర నాకు మోహ విచ్ఛేదము సేయుమయ్య.” మోహమంటే అజ్ఞానం. దానివల్ల కలిగే అభిమానం. దానితోనే వీరు నావారు- వీరు పరాయి వారనే భావం మానవులకు. అది తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించ మంటుంది. “ఘన సింధువుఁ జేరెడి గంగ భంగి నీ పాదసరోజ చింతనము పై ననిశంబు మదీయ బుద్ధి న త్యాదర వృత్తితోఁ గది యు నట్లుగఁ జేయ గదయ్య." నీ పాదాల మీద నా మనసు నిలుస్తుందో లేదో అది నిలిచేలాగా నీవే అనుగ్రహించ మంటుంది. అప్పటికి మోహ విచ్ఛేదం చేయ వలసిందీ భగవంతుడే. భగవత్తత్త్వాన్ని భజించే భావాన్ని కలిగించ వలసిందీ భగవానుడే కుంతి దృష్టిలో.
ఇదే సగుణ భక్తుల దృష్టి. వారు భగవంతుణ్ణి ఎప్పుడూ సగుణంగానే భావిస్తారు. సగుణ మనే సరికి ఒక నామంతో ఒక రూపంతో తమ మధ్య
Page 147