భగవత్పాద ద్వయ భక్తి ఉండాలి. మొదట మనకు. హరి పాద ద్వయ మీ
కనిపించే నామ రూపాలే. “పద్యతే గమ్యతే ఇతిపాదః" అని పాద శబ్దానికి
వ్యుత్పత్తి చెప్పారు భగవత్పాదులు. ఏది పరతత్త్వాన్ని చేరుస్తుందో అది పాదం.
అవి ఈ నామ రూపాలే. ఇవి ఆ పరమాత్మ సృష్టించినవే గనుక ఈ సృష్టిని
పట్టుకొంటే ఆస్రష్ట గుట్టుమనకు పట్టి ఇస్తాయి. అందుకే నేమో త్యాగ
బ్రహ్మ "పవ మాన సుతుడు పట్టు పాదార విందములకు - నీ నామ
రూపములకు నిత్య జయ మంగళ" మని గానం చేశాడు. పవమాన సుతుడు
పట్టిన పాదా లేవో కావు. నిజాని కవి నామరూపాలే త్యాగయ్య దృష్టిలో.
ఇదే జ్ఞాన దృష్టి. ఈ దృష్టి ఆ రూఢమై ఉండాలి. ఆరూఢమైనందు కేమిటి
దాఖలా. ఏది చూస్తున్నా చేస్తున్నా నామరూపాత్మకంగా కాక భగవ ద్రూపంగా
ప్రతి ఒక్కటీ దర్శన మివ్వాలి. అంటే ఇది ఫలానా - అది ఫలానా - అని
గాక ప్రతి ఒక్కటీ కేవలం ఆస్తి భాతి అని మాత్రమే చూడ గలగాలి.
అప్పుడిక చిత్త వృత్తు లిన్ని లేవు. ఒకే ఒక అఖండాకార వృత్తిగా మారి
ఎప్పటికీ అది ఇక చలించదు. మరొక విజాతీయ భావ ముంటే గదా
చలింటాని కంతా హరి మయమే అయి పోయింది. అలా అయి పోయిన
జీవులే ధన్యులు. వారి జీవితమే ధన్య జీవితం. అంతే కాదు. నిరంతర
హరి చింతన మూలంగా వారికిక జనన మరణాలనే ప్రసక్తే లేదు. నిత్య
ముక్తుడైన పరమాత్మ లాగా వారు కూడా ముక్తులే అవుతారు. ఇదే భాగవత
సందేశ మసలు.
ఉదాత్తమైన ఈ దివ్య సందేశమే అందిస్తునది మనకు కృష్ణావతార చరిత్ర. అర్థమైన వాడి కది అమృతం. కాని వాడి కది హాలాహలం. కనుకనే భాగవతము తెలిసి పలుకుట కష్టం బని చాటింది. భాగవత మంటే భగవత్తత్త్వమే. అది కృష్ణావతారంలో వ్యక్తమైనంతగా మరే అవతారంలోనూ కాలేదు. దాని నున్న దున్నట్టు పట్టు కోవాలంటే సామాన్యం కాదు. లోక సామాన్యమైన బుద్ధులతో లోకాతిశాయి అయిన ఆ తత్త్వాన్ని గ్రహించ
Page 143