#


Index

  ఇప్పుడే గాదీ నాస్తికులు. అప్పుడూ ఆరోజులలో కూడా ఉన్నట్టే చాటుతున్నది పురాణం. వారే గదా ఆయన ఈశ్వర త్వాన్ని ఆనుక్షణమూ అధిక్షేపిస్తూ వచ్చిన శిశుపాలాదులు. మరి ఇలాంటి పరిస్థితిలో ఆ ఈశ్వర తత్త్వాన్ని అందుకొనే మార్గ మేమిటి. అది మన కెలా లభిస్తుందని ప్రశ్న. చెబుతున్నాడు దానికి సమాధానం.

సవేద ధాతుః దురంత వీర్యస్య యో మా యయా భజేత తత్పాద పదవీమ్ రథాంగ సంత తయాను సరోజ పరస్య పాణేః వృత్త్యా గంధమ్

ఇంచుక మాయ లేక మది నెప్పుడుఁ బాయని భక్తి ర్తించుచు నెవ్వ డేని హరి దివ్య పదాంబుజ గంధ రాశిసే వించు నతండు గాంచు నర విందభ వాదులకైన దుర్లభో తోడవ దంచిత మైన యా హరి యుదార మహాద్భుత కర్మమార్గముల్

  మాయఅంటే అజ్ఞానం. అజ్ఞాన మనేది ఏ కొంచెమూ ఉండకూడదు. అంతా ఈశ్వరుడేనని సర్వాత్మభావం పూర్తిగా ఉండాలి. అది ఎప్పుడో మెరుపు లాగా తళుక్కు మని మెరిసి పోయే దైతే లాభం లేదు మరలా. ఎప్పుడూ పాయకుండా ఉండాలి. ఇలాంటి జ్ఞాన నిష్ఠకే భక్తి అని పేరు. అది కేవలం మదిలోనే గాక బాహ్య జీవితంలో కూడా ప్రతిఫలించాలి. అభ్యంతరంగా కలిగిన నిశ్చయ జ్ఞానం బాహ్యంగా మనం నడుచుకొనే ప్రతి నడతలోనూ కనిపించాలి. లోపలా వెలుపలా మనోవాక్కాయ వ్యాపారాలన్నీ తదాకారంగానే మారి పోవాలి. ఇదే వర్తించట మంటే. అలా వర్తించే వాడెవడైనా సరే. జాతి వర్ణ వయో లింగాది భేదం లేదిక. భగవత్తత్త్వాన్ని నిరంతరమూ అనుభవిస్తూనే ఉంటాడు. ఉంటాడంటే సన్న్యసించి ఎక్కడో ఏ అడవులకో కొండలకో పారి పోయి అక్కడ కూచుంటాడని కాదు. అక్కడికి పోయినా అదీ ఇలాంటి సంసారమే. నామ రూపా లెక్కడికి పోయినా కనిపిస్తూనే ఉంటాయి.

Page 140