#


Index

  వాడెప్పటికీ ఆ భగవత్త త్త్వాన్ని అర్థం చేసు కోలేడు. "అజ్ఞశ్చా శ్రద్ధ ధానశ్చ సంశ యాత్మా వినశ్యతి" అన్నారు. చేసుకోనంత వరకూ వాడు లోకంలో ఉన్నా లేని వాడే. వాడి జీవిత మంతా నిరర్థకమే. తత్త్వాన్ని దాని స్థాయి కెదిగి చూడలేక పోతే వాడేమి మానవుడు. వాడి దేమి జ్ఞానం. ఇది ఎలాటి దంటే ఒక గొప్ప నర్త కుడుంటాడు. వాడెన్నో భంగిమలలో ఎన్నో నాట్య రీతులు ప్రదర్శిస్తుంటాడు. అలా ప్రదర్శిస్తుంటే వాటిలో ప్రతి ఒక్కటీ చూచి ఆహా ఎంత బాగా చేస్తున్నాడని అభినందించే శక్తి ఉండాలి ప్రేక్షకుడికి. అలాటి యోగ్యతలేని పల్లెటూరి మొద్దు కేమని పిస్తుంది. అవన్నీ శివమెత్తి ఆడే చిందులుగానూ గంతులు గానూ భాసిస్తాయి. అనర్తన మెంత చిత్ర విచిత్రంగా ఉన్నా అందులో ఎంత గొప్ప క్రమ మున్నా వాడి బుద్ధి కది అంతా అలికినట్టు ఒకటి గానే - ఎంతో అవత తవక గానే కనిపిస్తుంది. అలాగే ఆ ఈశ్వరుడొక గొప్ప నర్తకుడు. ఆయన నర్తన మగణితమూ సక్రమమూ ఆయిన నర్తన. అదే ఈ సృష్టి, స్థితి, లయాత్మకంగా సాగుతూన్న భువన వ్యవహారం. దీని నా ఈశ్వరుడి భూమిక కెదిగి చూచే ప్రాజ్ఞుడైతే గ్రహించగలడు దీని ఆంతర్యం. అలా కాని మూఢుడి కిది ఎలా బోధ పడుతుంది. మీదు మిక్కిలి ఇదంతా ఒకఅర్థం లేని హంగామాగా కనిపించి ఆక్షేపిస్తాడు. అలా ఆక్షేపించిన వారే రుక్మి శిశుపాల జరా సంధాదులు. దుర్యోధనాదు లాయన విశ్వ రూపంచూచి కూడా అది ఒక గారడీ పొమ్మన్నారు. వారెవరికీ బోధ పడలేదా తత్త్వం. విభూతి చూచి కూడా గ్రహించ లేకపోయారు. అదే భీష్మ విదురాదులైన భాగవతులైతే ఆ జగన్నాటక సూత్రధారి నటించిన ప్రతిలీలా విశేషం లోనూ ఆయన విశ్వాతిగమైన సచ్చిత్స్వ రూపాన్నే దర్శిస్తూ పోయారు.

  అయితే ఎప్పుడో వారెవరో దర్శించారని చెబితే ఏమి ప్రయోజనం. అది అప్పుడూ ఇప్పుడూ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దర్శించ గలిగి ఉండాలి. దర్శించ గలిగితే ఇందరు నాస్తికులూ ఇందరు హేతువాదులూ ఎలా ఏర్పడ గలిగారు.

Page 139