#


Index

  దూర దూరంగానే ఉండి అనుభవిస్తాడు. ఆకాశ మిప్పు డంతటా ఉంది. అన్నింటి లోపలా వెలుపలా వ్యాపించి కూడా ఆమూర్తం కాబట్టి అది దేనినీ అంటదు. దాని నేదీ అంటదు. అలాగే అమూర్తమైన ఆత్మ తత్త్వం కూడా సుఖదుఃఖాది భోగాల మధ్యే మెలగుతున్నా అదీ వాటి నంటి ముట్టదు. అలాంటప్పుడిక బంధ మేముంది. ఇంద్రియాలకు చిక్కదది. పైగా ఆ ఇంద్రియా లనే బంధించి తన ఇచ్చాను సారంగా త్రిప్పుతూ పోతుంది. అధోక్షజుడూ హృషీకేశుడని పరమాత్మకు పేరు వచ్చింది ఇందుకే. అక్షములంటే ఇంద్రియాలు. హృషీక మన్నా ఇంద్రియమే. వాటి జ్ఞానాన్ని అధః కరించిన వాడూ వాటిని వశీకరించుకొన్న వాడూ గనుక ఆయన అధోక్షజుడూ హృషీకేశుడూ అయ్యాడు. దీని మూలంగా మనం గ్రహించ వలసిన రహస్య మేమిటి. కృష్ణు డవతరించి నప్పటి నుంచీ నిర్యాణమయ్యే దాకా కనిపించిన ఆ నీల మేఘ శ్యామల మైన ఆకార మసలు వాస్తవంలో అక్కడ లేనే లేదు. అమూర్తమైన తత్త్వం మూర్తమెలా అయింది. అయిందంటే అది మాయామయం. యధార్థం కాదన్నమాట. కనుకనే “మాయై షాహి మయా సృష్టా యన్మాం పశ్యసి నారద” నారదా నీవు చూస్తున్నది నా నిజ స్వరూపం కాదు- అది మాయ- అని చెప్పగలిగాడు నారదుడి కాయన. కాగా ఇక శరీర ధారణమే మాయ అయినప్పుడాయన ఆ శరీరంతో చేసిన అనుభవించిన ఇంద్రియ భోగాలు మాత్రం సత్యమెలా అవుతాయి. అవీ మాయే. అంటే అప్పటికీ గోపికల తోడి రాస క్రీడాదులూ - పదహారు వేల మందిని పరిణయ మాడటాలూ ఇవన్నీ కేవల మొక మాయా విలాసమే నని అర్థం చేసుకోవాలి మనం. దీనితో ఆయన కంట గట్టిన జారత్వాది దోషా లెగిరిపోతాయి. అంతేకాదు. ఇంద్రియాను భవాలన్నప్పుడు సుఖమే కాదు. దుఃఖం కూడా. కనుక చివర కాయనకు కలిగిన బాణ ప్రహారమూ ప్రాణ ప్రహణమూ- ఇవి కూడా ఒక నటనే నని గ్రహించ వలసి ఉంటుంది.

Page 136