వాడా వార్త మైత్రేయుని వల్ల ఆలించి యోగ మార్గంతో తనువు చాలించాడు. ఇందరికి నేర్పిన వైరాగ్యం పాండవులకు మాత్రం నేర్పక పోతుందా భగవ న్నిర్యాణ వార్త. వారూ ద్వాపర నిర్గ మనమూ కలియు గాగ మనమూ అప్పుడే చూసి మనసులో రోసి దారి తీశారు ప్రస్థానానికి. ఎవరికి వారు యచ్ఛే ద్వాఙ్మనసీ అన్న రీతిలో యోగ సమాధిగతులై ప్రాణ త్యాగం చేశారు. ఇంతకూ జీవిత కాలంలోనే కాక పరమాత్మ నిర్యాణా నంతరం కూడా తన ఆశ్రితులకు జ్ఞాన వైరాగ్యాల నుపదేశిస్తూనే వచ్చాడు. జీవితంలో వాగ్రూపంగా నైతే జీవితా నంతరం మౌన రూపంగా. నిర్యాణం జీవితం కంటే ఇంకా బలంగా ప్రభావం చూపింది ఆశ్రితుల స్వభావం మీద.
అయితే ఇదంతా మన వ్యామోహమే గాని అసలు పరమాత్మ జీవించట మేమిటి. మరణించట మేమిటి. ఆ మాటకు వస్తే ఆసలాయన జన్మించనే లేదు. జన్మ లేనపుడిక జీవితమూ నిర్యాణ మనే మాటల కర్థమే లేదు. అజుడూ, అచ్యుతుడూ అయినవాడెలా జన్మిస్తాడని. జన్మించకనే పోతే దుష్ట శిక్షణాది కర్మ మెలా చేస్తాడని. రెండూ అబద్ధమే. కనుకనే భాగవతా వతరణంలోనే ఇలా వ్రాస్తున్నాడు వ్యాస భగవానుడు.
ఏవం జన్మాని కర్మాణి - హ్యకర్తు రజన స్వచ వర్ణ యంతిస్మ కవయో - వేద గుహ్యాని హృత్పతేః
జననము లేక కర్మముల జాడలఁ బోక సమస్త చిత్తవర్తనుడగు చక్రికిం గవు లుదార పదంబుల జన్మ కర్మము ల్వినుతులు సేయు చుండుదురు-వేదరహస్యము లందు నెందుఁజూచిన మఱి లేవు జీవునకుఁ జెప్పిన కైవడి జన్మ కర్మముల్
జన్మ కర్మ అనేవి భగవానుడి కెప్పుడూ లేవు. ఉండటానికి వీలు లేదు. ఆయన అజుడూ అవ్యయుడూ- పైగా సమస్త చిత్త వర్తనుడైన చక్రి ఆయన.
Page 133