#


Index

  ఎందుకా నటన. "బలహీ నాంగులకున్ బలాధికులకున్ ప్రత్యర్థి భావోద్యమం బులు కల్పించి వినాశము న్నెఱపి ఈ భూభారముం బాపి నిశ్చల వృత్తిం గృతకార్యుడై చనియె”- ఆయన తానుగా చేయవలసిన కార్యమొకటే ఒకటున్నది. అది ఈ భూభారాన్ని పాపటం. భారమేమిటి. పాపట మేమటి. భార మధర్మ విజృంభణ. దాన్ని పాపట మంటే ధర్మ ప్రతిష్ఠాపనమే. అది దుష్ట శక్తులను శిక్షించటమూ - శిష్ఠులను రక్షించటం ద్వారానే జరగవలసి ఉంది. అలాగే జరిపాడు వెళ్లా “డా సర్వేశ్వ రుండచ్యుతుం డలఘుం డేమిని చెప్పుదున్” అంతా భగవదీయా యత్తమే మన ప్రజ్ఞ ఏమీ లేదని ఆక్రందన చేస్తాడు.

  నిజంగా పాండవుల ప్రమేయ మేమీ లేదు. కర్తా కారాయితా చైవ అన్నట్టు అంతా ఆ పరమేశ్వరుడే. ఊరక వారు నిమిత్త మాత్రులే. అందుకే "చంచద్గర్వుల ధార్త రాష్ట్రుల ననిం జంపించి గోవిందు డిప్పించెన్ రాజ్య” మని చెప్పటం.. చంపించిందీ ఇప్పించిందీ ఆయనే. చివరకు మూడశ్వ మేధ యాగాలు చేయించి పాండవుల కఖండమైన కీర్తిని కల్పించింది కూడా ఆయనే. ఇప్పించె కల్పించె అనేక్రియా పదాలే చెబుతున్నాయి అంతా కృష్ణ గారడే పాండవుల పరాక్రమమేమీ లేదని. పాండవుల పరాక్రమమే అయితే అభిమన్యుడి ప్రాణాలు పోకుండా కాపాడుకోలేరా. పరీక్షిత్తు పిండాన్ని రక్షించలేరా. భగవంతుడుపే క్షించిన వాణ్ణి ఎవరు గానీ రక్షించలేరు. రక్షించ దలచిన వాణ్ణి ఎవరు గాని శిక్షించ లేరు. ఇవి రెండూ ఈ రెండు ఘట్టాలలో చూడనే చూచారు పాండవులు. చివర కవసానంలో అన్నిటికీ దాఖలా చూడ గలిగారు. ఇక చేయవలసిన దేముంది జీవితంలో. "సంసార మేవం నిస్సారమ్ దృష్ట్వా సార దిదృక్షయా ప్రవృజంతి” అన్న అభియుక్తోక్తి ననుసరించి మహా వైరాగ్యంతో ఒక మహా ప్రస్థానం చేయట మొక్కటే మిగిలి ఉంది. అంతకు ముందే యదు వంశ విధ్వంసమూ కృష్ణ నిర్యాణమూ రెండూ విని వారి తల్లి కుంతి శాంతి మార్గాన్ని అవలంబించి కృష్ణ ధ్యానం చేస్తూ తనువు చాలించింది. మహా భక్తుడు విదురుడు తీర్థ యాత్రాగతుడైన

Page 132