#


Index

  జన్మించాడు కాని మరణించలేదు. దీనికి భిన్నంగా కృష్ణుడు జన్మించలేదు. కాని మరణిస్తాడు. మరణించటం వల్లనేగదా అర్జునుడాయన కళేబరాన్ని దహనం చేయవలసి వచ్చింది. ఇందులో మనం గ్రహించవలసిన సూక్ష్మమేమంటే ఇద్దరూ అసలు జన్మించనూలేదు - మరణించనూలేదు. ఎందుకంటే జన్మఉందంటే మరణ ముండితీరుతుంది. మరణముందంటే జన్మా ఉండక తప్పదు. అందులో ఏ ఒకటి లేక పోయినా మరొకటి ఉండటానికి లేదు. దీనిని బట్టి రెండూ జనన మరణాలు లేనివే. కనుకనే రెండూ భగవ దవతారాలేనని సాకూతంగా ద్యోతనం చేసిన ట్టవుతున్నది.

  ఇంతకూ తేలిందేమంటే రామాయణ మాద్యంతాలు ఏ మాత్రం తడవి చూచినా రాముడి భగవత్తత్త్వం మనకు కంఠోక్తిగానే బయట పెడుతున్నాడు. మహర్షి. పోతే ఈ రెండు దరులనూ ఒరసి కొని పారే కథా వాహినిలో మాత్రమే అలా కంఠోక్తిగా వర్ణించ లేదాయన. బాహాటంగా వర్ణించ లేదనేగాని చాటు మాటుగా సూచన చేయటం మత్రం మాన లేదాయన. ఆద్యంతాలలో ఐతిహాసిక ధోరణిలో వాచ్యంగా చెబితే - మధ్యలోసంతా కావ్యమార్గంలో ఆ సత్యాన్ని ప్రతీయ మానం చేస్తూ వచ్చాడు. అదే ఆయన గారి రచనా చాతుర్యం. ఎంత మహర్షి అంత మహాకవి కూడా కదా వాల్మీకి. మధుమయ ఫణితీనామ్ మార్గదర్శీ - అని తరువాతి కవులంతా ఆయనను కీర్తించారంటే మరి ఆ పరిధిలో ఆ మాత్రం చమత్కృతి లేకుంటే ఎలాగ ? అది భాగీరధిలాంటి కథలో వెతుకుతూపోతే అక్కడక్కడా మణికర్ణికాది ఘట్టాలలాగ కనులకు కట్టినట్టు దర్శనమిస్తూ వస్తుంది మనకు. చూతామది ఎలాటిదో. బాలకాండలో విశ్వామిత్రుడు వస్తాడు దశరథుడి దగ్గరకి రాముణ్ణి తనతో పంపమని అడగటానికి. ఆ మాటవింటూనే హడలిపోతాడు దశరథుడు. అప్పుడు విశ్వామిత్రుడనేమాట వినండి. అహంతే ప్రతిజానామి -హతాంస్తాన్ విద్ధిరాక్షసాన్ - అహంవేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం పసిష్టోపి మహాతేజా - యేచేమే తపసిస్థితాః రాముడు ఆ

Page 13