#


Index

వచ్చి ఏకాంతంగా కలుసుకొని మాటాడుతూ పితామహుడిమాట విన్నవిస్తాడు. ఏమని. కాలోయమ్ తే నరశ్రేష్ఠ - సమీప ముపవర్తి తుమ్ యది భూయో మహారాజ ప్రజా ఇచ్ఛస్యుపాసితుమ్ వసవా వీర భద్రంతే-అధవా విజిగీషాతే సనాధా విష్ణునాదేవాః స్వామీ నీవీ కర్మభూమిలో ఉండివస్తానని చెప్పిన గడువు సమాప్తమయింది. మరి రావచ్చు వైకుంఠానికి. లేక ఇంకా ఈ ప్రజాపాలన చేయటం నీ కిష్టమైతే ఉండిపోవచ్చు. అలా కాక రావాలనుకుంటే దేవలోకం విష్ణు సాన్నిధ్యంతో సనాథ మవుతుంది. ఇంతకన్నా సాభిప్రాయమైన మాట ఏముంటుంది. దానికి తగినట్టే ఉంది రాముడిచ్చిన జవాబు కూడా చూడండి. త్రయాణా - మపిలోకానామ్ కార్యార్థం మమసంభవః - భద్రం తేస్తు గమిష్యామి - యత ఏవాహమా గతః హృద్గతో హ్యసి సంప్రాప్తో - నమేతత్ర విచారణా - ఓయీ నేనీ త్రిలోక వాసులకు సంబంధించిన కార్యమేదో దానికోస మవతరించాను. అది సక్రమంగా ముగిసింది. ఇక నాకు పనిలేదు వచ్చిన చోటికే వెళ్లిపోతాను. నా మనసులో ఉంది నీవు వస్తావని. రానే వచ్చావు. చాలా సంతోషం. ఇంతకన్నా రాముడి స్వరూపస్మృతికి తార్కాణ మేముంది.

  మరొక సన్నివేశం చూచినా తేటపడుతుందిది మనకు. రామనిర్యాణం కూడా ఒక అద్భుతమైన సందర్భమే. సరయూసలిలే రామః పద్భ్యామ్ సముపచక్రమే సరయూ జలంలో రాముడు ప్రవేశిస్తాడు. తతః పితామహోవాణీ- మంతరిక్షా దభాషత - వెంటనే బ్రహ్మదేవు డాకాశంలో నుంచి ఇలా అంటాడు. ఆగచ్ఛవిష్ణో భద్రంతే - దిష్ట్యా ప్రాప్తోసి రాఘవ -తామనుమ్ ప్రవిశస్వకామ్ వైష్ణవీమ్. వైష్ణవమైన నీ దివ్య శరీరాన్ని ప్రవేశించమని కోరుతాడు. వివేశ వైష్ణవం - తేజ స్సశరీర స్సహానుజః అనుజులతో కూడా వైష్ణవమైన మూర్తినే భజించాడట రాముడు. అనుజులు కూడా తన అంశలే కాబట్టి అంతా కలిసి ఒకేమూర్తి అయిందని భావం. పైగా సశరీరంగా అనటంవల్ల ఇది మరణంకాదని తెలుస్తున్నది. రాముడు

Page 12