ఆ తత్తాన్నే వేడుకోవాలి మనం. అదే లక్ష్మీపతీ నాకు నీ విలసత్పాద యుగంబు చూపమని వాపోతున్నాడు అక్రూరుడు. మనమూ అక్రూర చేతస్కులమై ప్రార్థిస్తేనే మనకది ప్రసాదిస్తాడు పరమాత్మ.
ఇలా చూస్తూ పోతే కృష్ణుడు పుట్టి పెరిగి చేసిన చేష్టలన్నీ మాన వోచితం కావు. అవి మాన వాతీత మైనవి. జన్మలేని ఈశ్వరుడే లోకంలో జన్మించి ఏ వ్యవహారమూ లేని ఈశ్వరుడే నలుగురితో వ్యవహరిస్తే ఎలా ఉంటుందో చూడాలంటే- దానికి కృష్ణ జననం దగ్గరి నుంచీ ప్రతిఒక్కటీ నిదర్శనమే. ప్రతి ఒక్కటీ ధర్మ సంస్థాపన కోసమే. అదే గదా అవతార ప్రయోజనం. దుష్ట నిగ్రహ మొక వైపయితే శిష్టా నుగ్రహం మరొకవైపు. ఎవరెవరిని ఎప్పుడంత మొందించాలో ఒక ప్రక్క ఆలోచన. మరొక ప్రక్క ఎవరినెప్పుడెలా ఉద్ధరించాలో విచారణ. ఉద్దవుడి కాయన చేసిన ఉపదేశ మాయన శిష్ట జనానుగ్రహంలో ఆఖరిది. చివర ఇక నిర్మాణమయి పోయే క్షణంలో జరిగిందది. ఆ నిర్యాణం కూడా ఎంత పరమాద్భుతంగా సాగిన వ్యవహారమో మన కర్థం కాదు. అసలాయన బంధు మిత్రాదులకే గాదు. భార్యా పుత్రులకే గాదు. ఏ ఒక్కరికీ అంతు పట్టలేదు. పట్టనీయ లేదాయన. అదీ ఒక లీలే. లేకుంటే మహర్షు లెవరో తన్ను దర్శించటానికి రావట మేమిటి. ఎవరో యాదవ కుమారులు చేసిన ఆగడానికి వారా వంశాన్నంతా శపించటమేమిటి. ఆ వంశ మెవరిది. తనదే గదా. తన దర్శనార్థం వచ్చిన వారు తన వంశానికే ఎసరు పెట్టట మేమిటి. పెట్టినవారు వారైతే గదా. వారి నెపంతో తానే పెట్టాడా ఎసరు. దానితో యాదవులంతా ఒక నలుసు మిగలకుండా తన కళ్ల ఎదుటనే చెల్లి పోయారు. ఇంకా ఒకరిద్దరు శేషించారని తెలిసి తానే వారిని నిశ్శేషం చేశాడు కూడా. తల్లి దండ్రులకు తానెక్కడికి వెళ్లేది చెప్పలేదు. అదే మంటే అర్జునుడికి కబురంపాను. వాడువచ్చి అన్నీ చూస్తాడని చెబుతాడు వారికి. షోడశ సహ ప్రాంతఃపుర కాంతలున్నారు. ఒక్కరికీ చెప్పలేదు. చివర కంత ప్రాణపదంగా భావించిన
Page 129